సెప్టెంబర్‌ 7 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

By సుభాష్  Published on  17 Aug 2020 3:49 PM GMT
సెప్టెంబర్‌ 7 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

సెప్టెంబర్‌ 7వ తేదీ నుంచి తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయించారు. వరదలు సహా పలు అంశాలపై సోమవారం సమీక్ష నిర్వహించిన కేసీఆర్‌ ఈ నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రానికి సంబంధించిన అనేక ముఖ్యమైన అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకునే అవకాశాలున్నందున అసెంబ్లీ వర్షాకాల సమావేశాలను నిర్వహించాలని నిర్ణయించారు. అయితే 20 రోజుల పాటు సమావేశాలు నిర్వహించడం వల్ల ముఖ్యమైన అంశాలపై చర్చ జరిపే అవకాశం ఉంటుందని సీఎం కేసీఆర్‌తో పాటు మంత్రులు అభిప్రాయపడ్డారు.

కనీసం 15 రోజుల పనిదినాలైన ఉండాలంటున్నట్లు తెలుస్తోంది. వచ్చే నెలలో జరిగే అసెంబ్లీ సమావేశాలకు సిద్దం కావాలని కేసీఆర్‌ మంత్రులకు, అధికారులకు సూచించారు. అసెంబ్లీ సమావేశాల్లో పలు బిల్లులు, తీర్మానాలు ప్రవేశపెట్టడంతో పాటు సర్కార్ విధాన నిర్ణయాలకు సంబంధించిన ప్రకటనలు కూడా చేయాల్సి ఉంటుందని, అందుకు సిద్ధంగా ఉండాలని కోరారు.

అంతేకాకుండా కరోనా వైరస్‌ ఉన్నందున సభ్యులు కూడా భౌతిక దూరం పాటించేందుకు అనుగుణంగా అసెంబ్లీ హాలులో ఏర్పాట్లు చేయాలని శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, అసెంబ్లీ కార్యదర్శి నర్సింహాచార్యులను సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. అసెంబ్లీ హాలుతో పాటు పరిసరాలను ఎప్పటికప్పుడు శానిటైజ్‌ చేయాలని ఆదేశించారు.

Next Story