కేంద్రం కీలక నిర్ణయం.. 12 నుంచి పట్టాలెక్కనన్న రైళ్లు.. ఎక్కడెక్కడంటే..

By సుభాష్  Published on  10 May 2020 4:16 PM GMT
కేంద్రం కీలక నిర్ణయం.. 12 నుంచి పట్టాలెక్కనన్న రైళ్లు.. ఎక్కడెక్కడంటే..

దేశ వ్యాప్తంగా కరోనా విజృంభిస్తుండగా, కరోనా కట్టడికి ఈనెల 17వ తేదీ వరకూ లాక్‌డౌన్‌ కొనసాగనుంది. ఈ నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఈనెల 12వ తేదీ నుంచి రైళ్లను నడపనున్నట్లు రైల్వేశాఖ ప్రకటించింది. ఈ మేరకు ఓ ప్రకటన జారీ చేసంది. ప్రయాణికుల కోసం ఈ నిర్ణయం తీసుకుంది. ఢిల్లీ నుంచి దేశంలోని 15 గమ్యస్థానాలకు మొత్తం 30 రైళ్లను నడపనున్నట్లు స్పష్టం చేసింది.

వీటిని స్పెషల్‌ ట్రైన్లుగా పిలవనున్నారు. ఢిల్లీ నుంచి సికింద్రాబాద్‌, దిబ్రూగఢ్‌, అగర్తలా, పాట్నా, హౌరా, బిలాస్‌పూర్‌, రాంచీ, భువనేశ్వర్‌, బెంగళూరు, చెన్నై, తిరునంతపురం, మడ్‌గావ్‌, ముంబైల్‌ సెంట్రల్‌, అహ్మదాబాద్‌, జమ్మూతావి రైల్వే స్టేషన్లకు ఈ రైళ్లను నడపనుంది. కాగా, నెల 11వ తేదీ సాయంత్రం 4 గంటల నుంచి ఐఆర్‌సీటీసీలో టికెట్లను బుక్‌ చేసుకోవచ్చని రైల్వేశాఖ తెలిపింది.

కాగా, ఇప్పటికే కేంద్రం పలు రంగాల్లో లాక్‌డౌన్‌ నుంచి సడలింపులు ఇచ్చిన విషయం తెలిసిందే. దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు కేంద్రం ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటోంది.



Next Story