మధ్యప్రదేశ్‌లో ఉప ఎన్నికల లెక్కింపులో బీజేపీ ఆధిక్యం

మధ్యప్రదేశ్‌లో ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఈ లెక్కంపు 28 అసెంబ్లీ స్థానాలకు జరుగుతోంది. ఈ లెక్కింపులో బీజేపీ

By సుభాష్  Published on  10 Nov 2020 5:14 AM GMT
మధ్యప్రదేశ్‌లో ఉప ఎన్నికల లెక్కింపులో బీజేపీ ఆధిక్యం

మధ్యప్రదేశ్‌లో ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఈ లెక్కంపు 28 అసెంబ్లీ స్థానాలకు జరుగుతోంది. ఈ లెక్కింపులో బీజేపీ 18 స్థానాలు, కాంగ్రెస్‌9 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. ఇతరులు ఒక స్థానంలో ముందంజలో ఉన్నారు. సన్వేర్‌ నియోజకవర్గం బరిలో ఉన్న బీజేపీ అభ్యర్థి తులసి సిల్వర్‌ ఆధిక్యంలో ఉన్నారు. మరో వైపు ఫలితాల సరళి నేపథ్యంలో రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కమల్‌నాథ్‌ కాంగ్రెష్‌ పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు.

ఏడు నెలల కిందట కమల్‌ నాథ్‌ నేతృత్వంలోని ప్రభుత్వాన్ని కూల్చి బీజేపీ గూటికి చేరిన సింధియా వర్గం చేరిన విషయం తెలిసిందే. అయితే ఖాళీ అయిన 25 స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహించారు. సిట్టింగ్‌ ఎమ్మెల్యేల మృతితో మరో మూడు నియోజకవర్గాలు ఈ ఉప ఎన్నిక జాబితాలో చేరాయి. 230 సీట్లున్న మధ్యప్రదేశ్‌ అసెంబ్లీలో ప్రస్తుతం బీజేపీకి 107, కాంగ్రెస్‌కు 87 మంది ఎమ్మెల్యేలున్నారు. అయితే సాధారణ ఆధిక్యాన్ని చేరుకోవాలంటే సీఎం శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ సారధ్యంలో బీజేపీకి మరో 8 సీట్లు దక్కాల్సి ఉంటుంది. 28 స్థానాల్లో అధిక స్థానాల్లో కాంగ్రెస్‌ విజయం సాధిస్తే అసెంబ్లీ తన బలాన్ని పెంచుకునే అవకాశం ఉంటుంది. వీటిలో 27 చోట్ల ఇది వరకు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలే ఉన్నారు. ఇక గుజరాత్‌, ఉత్తరప్రదేశ్‌ సహా వివిధ రాష్ట్రాల్లోనూ అసెంబ్లీ, బీహార్‌లో వాల్మీకినగర్‌ లోక్‌సభ స్థానానికి జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతంది. బీహార్‌ - 243 స్థానాలు, మధ్యప్రదేశ్‌ -28, గుజరాత్‌ - 8,యూపి -7, మరో 15 రాష్ట్రాలలో కలిపి 15 స్థానాలున్నాయి.


Next Story