ఎన్డీయే కూటమికి పట్టం కట్టిన బీహార్‌ ప్రజలు

Bihar elections.. NDA Win I బీహార్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలు హోరాహోరీగా జరిగాయి. ఎన్నికల ఓట్ల లెక్కింపులో ఎన్డీయే

By సుభాష్  Published on  11 Nov 2020 6:10 AM GMT
ఎన్డీయే కూటమికి పట్టం కట్టిన బీహార్‌ ప్రజలు

బీహార్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలు హోరాహోరీగా జరిగాయి. ఎన్నికల ఓట్ల లెక్కింపులో ఎన్డీయే కూటమి విజయం సాధించింది. ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలను తలకిందులు చేసే ఎన్డీయే కూటమి విజయం సాధించింది. 243 స్థానాలున్న బీహార్‌ అసెంబ్లీలో మ్యాజిక్‌ ఫిగర్‌ 122 ఉండగా, 125 స్థానాల్లో బీజేపీ కూటమి విజయకేతనం ఎగురవేసింది. రాష్ట్రాన్ని 15 ఏళ్ల పాటు పాలన పగ్గాలు చేపట్టిన నితీష్‌కుమార్‌ మరోసారి ముఖ్యమంత్రి సీటును దక్కించుకున్నారు.

ఓట్ల శానికికొస్తే...

ఇక ఓట్ల శాతం విషయానికొస్తే ఎన్డీయే కూటమికి 38.4 శాతం, మహాకూటమికి 37.3శాతం ఓట్లు వచ్చాయి. ఎల్జేపీకి 5.6 శాతం ఓట్లు, ఇతరులకు 18.7 శాతం ఓట్లు వచ్చాయి. ఇక విపక్ష పార్టీల కూటమి మహాఘట్‌ బంధన్‌ కూడా చివరి వరకు ఎన్డీయేకు గట్టి పోటీనిచ్చింది. 110 స్థానాల్లో మహాకూటమి విజయం సాధించింది. ముఖ్యంగా తేజస్వీ యాదవ్‌ సారధ్యంలో ఆర్‌జేడీ, ఎన్డీయేతో హోరాహోరీగా తలపడింది.

బీహార్‌లో అతిపెద్ద పార్టీగా ఏన్డీయే

జేడీయూను ఎదుర్కొని బీహార్‌ ఎన్డీయే కూటమిలో అతిపెద్ద పార్టీగా బీజేపీ అవతరించింది. ఎల్‌జేపీ ఓట్లు చీల్చడం బీజేపీకి కలిసొచ్చాయి. సాధారణంగా బీహార్‌ నితీష్‌ కుమార్‌ నేతృత్వంలోని జేడీయూ, లాలూ ప్రసాద్‌ యాదవ్‌ నేతృత్వంలో ఆర్జేడీ మధ్య పోటీ ఉంటుంది. అలాంటిది ఇప్పుడు రాష్ట్రంలో బీజేపీ తన స్థానాన్ని బలపర్చుకుంది. ప్రధాని నరేంద్రమోదీ ప్రజాకర్షణ శక్తితో పాటు జేపీ నడ్డా ప్రణాళికలతో మెరుగైన ఫలితాలు రాబట్టింది. దీంతో అఖండ విజయాన్ని సాధించిన బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించింది.

2015 అసెంబ్లీ ఎన్నికల్లో జేడీయూ, ఆర్జేడీ కలిసి పోటీ చేసే అధికారంలోకి వచ్చాయి. ఆర్జేడీ 80, జేడీయూ 70 స్థానాలు సాధించాయి. ఆ తర్వాత జేడీయూ-ఆర్జేడీ ప్రభుత్వం కూలిపోయి ఎన్డీఏ సర్కార్‌ వచ్చిన తర్వాత బీజేపీకి మరింత ఉత్సాహం లభించింది. రాష్ట్రంలో పార్టీని స్థిరీకరించేందుకు కమలదళం కంకణం కట్టుకుంది. ఈ కార్యక్రమాన్ని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ముందుండి నడిపించగా, అమిత్‌షా తెర వెనక వ్యూహాలతో కీలక పాత్ర పోషించారు.

Next Story