ప్రధాని మోదీ పర్యటనకు ముందు.. గాంధీ విగ్రహం ధ్వంసం

ఇటలీలో మహాత్మా గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేసిన కొద్ది గంటలకే ఖలిస్థానీ వేర్పాటు వాదులు ధ్వంసం చేశారు.

By M.S.R  Published on  12 Jun 2024 3:44 PM GMT
Prime Minister Modi, tour, Gandhi statue destroy,

ప్రధాని మోదీ పర్యటనకు ముందు.. గాంధీ విగ్రహం ధ్వంసం 

ఇటలీలో మహాత్మా గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేసిన కొద్ది గంటలకే ఖలిస్థానీ వేర్పాటు వాదులు ధ్వంసం చేశారు. జూన్ 14న ఇటలీలో జీ7 సదస్సు జరగనుంది. ఈ సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొననున్నారు. ప్రధాని పర్యటనకు ముందు గాంధీ విగ్రహాన్ని ధ్వంసం చేయడం కలకలం రేపింది. హత్యకు గురైన ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జార్‌కు సంబంధించిన వివాదాస్పద నినాదాలను నిందితులు ఆ ప్రాంతంలో రాశారు. ఘటన అనంతరం స్థానిక అధికారులు ఆ ప్రాంతాన్ని శుభ్రం చేసినట్లు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొననున్న జీ7 సదస్సుకు ఒకరోజు ముందు ఈ ఘటన జరిగింది.

50వ G7 సమ్మిట్ జూన్ 13 నుండి 15 వరకు ఇటలీలోని అపులియా ప్రాంతంలోని బోర్గో ఎగ్నాజియా విలాసవంతమైన రిసార్ట్‌లో జరుగుతుంది. విదేశాంగ కార్యదర్శి వినయ్ మోహన్ క్వాత్రా మాట్లాడుతూ ఇటలీ ప్రధాని జార్జియా మెలోని ఆహ్వానం మేరకు ప్రధాని మోదీ రేపు ఇటలీలోని అపులియాకు వెళ్లనున్నారని తెలిపారు. ఈ సంఘటన గురించి విదేశాంగ కార్యదర్శి క్వాత్రా ఇటలీ అధికారులతో చర్చించారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

Next Story