'ప్రతి రోజు పండగే' ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్..!
By అంజి Published on 3 Dec 2019 4:05 AM GMTమెగా హీరో సాయిధరమ్ తేజ్ - యంగ్ డైరెక్టర్ మారుతి కాంబినేషన్ లో రూపొందుతోన్న చిత్రం ప్రతిరోజు పండగే. సాయితేజ్ సరసన రాశీఖన్నా నటిస్తుంది. లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా రూపొందుతోన్న ఈ సినిమాని గీతా ఆర్ట్స్ సంస్థ నిర్మిస్తుంది. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు ఈ సినిమాని నిర్మిస్తున్నారు.
సత్యరాజ్ కీలకమైన పాత్రను పోషించిన ఈ సినిమాను ఈ నెల 20వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి ఒక ట్రైలర్ ను రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ ట్రైలర్ ను డిసెంబర్ 4వ తేదీన రిలీజ్ చేయనున్నట్టు ట్విట్టర్ ద్వారా తెలియచేసారు. ఎస్.ఎస్. తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు.
ఈ సినిమాలో రావు రమేష్, మురళీ శర్మ ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు. వైవిధ్యమైన కథాంశంతో అందర్నీ ఆకట్టుకునేలా రూపొందిన ఈ సినిమా ప్రతి ఒక్కరికీ నచ్చుతుందని దర్శకుడు మారుతి గట్టి నమ్మకంతో ఉన్నారు.