తిరుమల భక్తులకు అలర్ట్.. ప్రత్యేక దర్శన టికెట్లు, గదులను బుక్ చేసుకోండి..
తిరుమల శ్రీవారి దర్శనానికి నిత్యం ఎంతోమంది భక్తులు వెళ్తుంటారు.
By Srikanth Gundamalla Published on 23 July 2024 6:45 AM IST
తిరుమల భక్తులకు అలర్ట్.. ప్రత్యేక దర్శన టికెట్లు, గదులను బుక్ చేసుకోండి..
తిరుమల శ్రీవారి దర్శనానికి నిత్యం ఎంతోమంది భక్తులు వెళ్తుంటారు. భక్తుల రద్దీతో దర్శనానికి గంటల పాటు సమయం పడుతోంది. ఈ నేపథ్యంలోనే ప్రతి నెలా తిరుమల తిరుపతి దేవస్థానం కొన్ని ప్రత్యేక దర్శన టికెట్లను విడుదల చేస్తూ ఉంటుంది. దర్శన టికెట్లతో పాటు ఆర్జిత సేవలు, వసతి గదులు ఆన్లైన్ కోటాను విడుదల చేస్తోంది. అక్టోబర్ నెలకు సంబంధించి కోటా విడుదల చేస్తోంది టీటీడీ. అక్టోబరు నెలకు సంబంధించిన అంగప్రదక్షిణం టోకెన్ల కోటాను ఇవాళ ఉదయం 10 గంటలకు టీటీడీ విడుదల చేస్తుంది. తిరుమల శ్రీవాణి ట్రస్టు టికెట్లకు సంబంధించిన అక్టోబరు నెల ఆన్ లైన్ కోటాను నేటి ఉదయం 11 గంటలకు విడుదల చేస్తారు.
ఇక జులై 24న ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా విడుదల చేయనుంది తిరుమల తిరుపతి దేవస్థానం. రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు అక్టోబరు నెలకు సంబంధించిన కోటాను బుధవారం ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. తిరుమల, తిరుపతిలలో అక్టోబరు నెల గదుల కోటాను జూలై 24న మధ్యాహ్నం 3 గంటలకు ఆన్లైన్లో విడుదల చేస్తారు. జులై 27న తిరుమల , తిరుపతి శ్రీవారి సేవ కోటా ఉదయం 11 గంటలకు, నవనీత సేవ మధ్యాహ్నం 12 గంటలకు, పరకామణి సేవ మధ్యాహ్నం 1 గంటకు ఆన్లైన్లో విడుదల చేయనున్నారు.