శ్రీవారి భ‌క్తుల‌కు శుభ‌వార్త‌.. 28న ప్ర‌త్యేక ద‌ర్శ‌న టికెట్లు విడుద‌ల‌

Srivari Special Darshan February quota tickets will released from this month 28th. క‌లియుగ ప్ర‌త్య‌క్ష దైవం

By తోట‌ వంశీ కుమార్‌  Published on  27 Jan 2022 5:56 AM GMT
శ్రీవారి భ‌క్తుల‌కు శుభ‌వార్త‌.. 28న ప్ర‌త్యేక ద‌ర్శ‌న టికెట్లు విడుద‌ల‌

క‌లియుగ ప్ర‌త్య‌క్ష దైవం శ్రీవేంక‌టేశ్వ‌ర స్వామి వారిని ద‌ర్శించుకునేందుకు దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచే కాకుండా విదేశాల నుంచి భ‌క్తులు త‌ర‌లివ‌స్తుంటారు. ఈ నేప‌థ్యంలోనే స్వామి వారి భ‌క్తుల‌కు తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం(టీటీడీ) శుభ‌వార్త చెప్పింది. ఫిబ్ర‌వ‌రి నెల‌కు సంబంధించిన శ్రీవారి ద‌ర్శ‌న టికెట్లు విడుద‌ల చేయ‌నున్న‌ట్లు తెలిపింది. ఈనెల 28వ తేదీ శుక్ర‌వారం ఉద‌యం 9 గంట‌లకు ప్ర‌త్యేక ప్ర‌వేశ‌ద‌ర్శ‌న టికెట్లును జారీ చేయ‌నున్నారు.రోజుకు 12 వేల చొప్పున టికెట్లను అందుబాటులోకి ఉంచ‌నున్న‌ట్లు తెలిపింది.

ఈ నెల 29న శ‌నివారం ఉద‌యం 9 గంట‌ల‌కు టైం స్లాట్ స‌ర్వ‌ద‌ర్శ‌న టికెట్ల‌ను విడుద‌ల చేయ‌నున్న‌ట్లు తెలిపింది. రోజుకు 10 వేల చొప్పున స‌ర్వ‌ద‌ర్శ‌నం టోకెన్ల‌ను ఆన్‌లైన్‌లో విడుద‌ల చేయ‌నున్నారు. అయితే.. ఫిబ్ర‌వ‌రి నెల‌లో ద‌ర్శ‌నం టికెట్ల‌ను పెంచుతార‌ని అంతా బావించారు. కాగా.. క‌రోనా వ్యాప్తి నేప‌థ్యంలో ప‌రిమితంగానే శ్రీవారి ద‌ర్శ‌న టికెట్లు విడుద‌ల చేస్తున్న‌ట్లు వెల్ల‌డించింది. భ‌క్తులంతా టికెట్ల‌ను టీటీడీ అధికారిక వెబ్‌సైట్‌లలో మాత్రమే టికెట్లు బుక్‌ చేసుకోవాలని విజ్ఞప్తి చేసింది.

Next Story