కశ్మీర్‌లో హైటెన్షన్‌.. ముగ్గురు ఉగ్రవాదులు హతం

By సుభాష్  Published on  31 Jan 2020 11:36 AM GMT
కశ్మీర్‌లో హైటెన్షన్‌.. ముగ్గురు ఉగ్రవాదులు హతం

కశ్మీర్‌లో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. జమ్మూ-శ్రీనగర్‌ జాతీయ రహదారిపై శుక్రవారం భారీ ఎన్‌కౌంటర్‌ చోటు చేసుకుంది. ఈ కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. నగ్రోటా టోల్‌ ప్లాజా వద్ద పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తున్న సమయంలో నలుగురు ఉగ్రవాదులు ఓ ట్రక్కులో వచ్చి పోలీసులపై కాల్పులకు తెగబడ్డారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు వారిపై ఎదురు కాల్పులకు దిగారు. దీంతో ముగ్గురు ఉగ్రవాదులను భద్రతా బలగాలు హతమార్చాయి.

ఈ కాల్పుల్లో ఓ కానిస్టేబుల్‌కు గాయాలయ్యాయి. మరో ఉగ్రవాది తప్పించుకుని అడవిలోకి పరారయ్యాడు. గాయాలైన కానిస్టేబుల్‌ను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. హతమైన ఉగ్రవాదుల మృతదేహాల వద్ద పెద్ద ఎత్తున పేలుడు పదార్థాలు, ఇతర సామాగ్రి లభ్యమయ్యాయి. ఈ జాతీయ రహదారిపై భారీగా భద్రతా బలగాలు మోహరించాయి. ప్రస్తుతం ఈ జాతీయ రహదారిని మూసివేశారు. తప్పించుకుని పారిపోయిన ఉగ్రవాది కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Next Story