సీఎం కేసీఆర్‌కు వైఎస్‌ షర్మిల సవాల్‌.. షూ గిఫ్ట్‌గా ఇచ్చి మరీ..

YS Sharmila gifted shoes to CM KCR asking him to go on a padayatra with her. తెలంగాణలో ప్రజల కష్టాలను తెలుసుకునేందుకు తన వెంట కేవలం మూడు కిలోమీటర్లు

By అంజి  Published on  2 Feb 2023 9:49 AM GMT
సీఎం కేసీఆర్‌కు వైఎస్‌ షర్మిల సవాల్‌.. షూ గిఫ్ట్‌గా ఇచ్చి మరీ..

తెలంగాణలో ప్రజల కష్టాలను తెలుసుకునేందుకు తన వెంట కేవలం మూడు కిలోమీటర్లు మాత్రమే నడిచి రావాలని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల గురువారం ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావుకు పిలుపునిచ్చారు. తన ప్రజాప్రస్థానం పాదయాత్రలో చివరి దశకు వెళ్లే ముందు ఆమె కేసీఆర్‌కు ఈ సవాల్ విసిరారు. హైదరాబాద్‌లోని తన నివాసంలో వైఎస్ షర్మిల మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చడంలో కేసీఆర్ విఫలమయ్యారన్నారు. గత తొమ్మిదేళ్లుగా రాష్ట్రంలో ఈ నిరంకుశ, అసమర్థ పాలనతో అన్ని వర్గాలు ఇబ్బందులు పడుతున్నాయి. రైతుల కష్టాలు, యువత కష్టాలు, మహిళల సమస్యలు, విద్య వరకు.. కేసీఆర్ ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకోవడంలో విఫలమయ్యారని షర్మిల అన్నారు.

కేసీఆర్ వైఫల్యాలను, అవినీతిని బయటపెట్టేందుకు తమ పార్టీ ప్రయత్నిస్తే తన పాదయాత్రపై నిర్దాక్షిణ్యంగా దాడి చేశారని షర్మిల అన్నారు. ''ఈ రోజు నేను ముఖ్యమంత్రిని ఒక రోజంతా మాతో కలిసి నడవాలని సవాలు చేస్తున్నాను. రాష్ట్రంలోని ప్రతి వ్యక్తి సంతోషంగా ఉన్నారని, మీరు పరిష్కరించే సమస్యలు లేవని మీరు మాకు చూపిస్తే, నేను రాజకీయాల నుండి తప్పుకుంటాను. నేను మీరు నడవడానికి ఈ సరికొత్త జత బూట్లు బహుమతిగా ఇస్తున్నాను. ఇది మీ కాలు సైజ్‌కు అనుగుణంగా ఉంటుంది. సరిపోకపోతే మార్పిడి చేయడానికి బిల్లు ఉంది'' అంటూ షర్మిల వ్యాఖ్యానించారు.

వైఎస్ షర్మిల ఫిబ్రవరి 2న వరంగల్‌లోని నర్సంపేట నుంచి ప్రజా ప్రస్థానం పాదయాత్రను పునఃప్రారంభించారు. షర్మిల 3,500 కిలోమీటర్లు నడిచారు, నర్సంపేటలోనే ఆమె కాన్వాయ్‌పై దాడి జరగడంతో మార్గమధ్యంలో పాదయాత్రను నిలిపివేశారు. ఫిబ్రవరి 2 నుంచి ఫిబ్రవరి 18 వరకు షర్మిల చేపట్టనున్న పాదయాత్రకు వరంగల్ పోలీసులు కొన్ని షరతులతో అనుమతి ఇచ్చారు. ప్రతిరోజూ ఉదయం 10 గంటలకు పాదయాత్ర ప్రారంభించి సాయంత్రం 7 గంటలకు ముగించాలని వారు ఆమెను కోరారు. ఖమ్మం జిల్లా పాలేరు అసెంబ్లీ నియోజకవర్గంలో పాదయాత్ర ముగియనుంది.


Next Story