రాజీవ్ ఆరోగ్యశ్రీకి సమృద్ధిగా నిధులు కేటాయిస్తాం: భట్టి

వైద్య, ఆరోగ్య శాఖకు నిధుల కేటాయింపులో అత్యంత ప్రాధాన్యత ఇస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు.

By Knakam Karthik
Published on : 18 Feb 2025 5:43 PM IST

Telangana, Hyderabad, Deputy CM Bhatti, Minister Rajanarsimha, Rajiv Arogyashri

రాజీవ్ ఆరోగ్యశ్రీకి సమృద్ధిగా నిధులు కేటాయిస్తాం: భట్టి

పేద, మధ్యతరగతి వర్గాలు అత్యధికంగా ఆధారపడే వైద్య, ఆరోగ్య శాఖకు నిధుల కేటాయింపులో అత్యంత ప్రాధాన్యత ఇస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు.పేద, మధ్యతరగతి వర్గాలు అత్యధికంగా ఆధారపడే వైద్య, ఆరోగ్య శాఖకు నిధుల కేటాయింపులో అత్యంత ప్రాధాన్యత ఇస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. మంగళవారం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సచివాలయంలో జరిగిన వైద్య, ఆరోగ్యశాఖ, సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రీ బడ్జెట్ సమావేశంలో సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అధికారులకు పలు సూచనలు చేశారు. గత దశాబ్ద కాలంగా డ్రగ్స్, ఫుడ్ సేఫ్టీ, మెడికల్ ఎడ్యుకేషన్ విభాగాలు నిర్లక్ష్యానికి గురయ్యాయని మంత్రులు అభిప్రాయపడ్డారు. ప్రజా ప్రభుత్వం లో ఈ మూడు విభాగాలకు ప్రాధాన్యత ఇచ్చి రాబోయే రోజుల్లో బలోపేతం చేస్తామని తెలిపారు. డ్రగ్స్, ఫుడ్ సేఫ్టీ విభాగాలను ఆధునికీకరణ చేస్తాం అన్నారు.

రానున్న బడ్జెట్‌లో రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకానికి సమృద్ధిగా నిధులు కేటాయించి, పేద, మధ్య తరగతి వర్గాలకు మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి తీసుకువస్తాం అని చెప్పారు. రానున్న ఏడాది కాలంలో రాష్ట్రంలో మెడికల్ కాలేజీల భవనాలు, హాస్పిటళ్ల నిర్మాణం పనులు పూర్తవుతాయని మంత్రులు వెల్లడించారు. కేంద్ర ప్రాయోజిత పథకాలను పెద్ద సంఖ్యలో వినియోగించుకునేందుకు అధికారులు కృషి చేయాలని మంత్రులు ఆదేశించారు. జిల్లా కేంద్రాల్లో సైన్స్ అండ్ టెక్నాలజీ ప్లాంటోరియంలు నిర్మించే ఆలోచనలో ఉన్నట్లు మంత్రులు తెలిపారు. సమావేశంలో స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు, వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ క్రిస్టియాన చొంగతా, సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రిన్సిపల్ సెక్రెటరీ అహ్మద్ నదీమ్, ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ సందీప్ కుమార్ సుల్తానియా, ఆర్థిక శాఖ జాయింట్ సెక్రటరీ హరిత తదితరులు పాల్గొన్నారు.

Next Story