వివేకా హత్య కేసు: సీబీఐ కోర్టులో లొంగిపోయిన ఎర్ర గంగిరెడ్డి

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ప్రధాన నిందితుడు ఎర్ర గంగిరెడ్డి అలియాస్‌ తుమ్మలపల్లి గంగిరెడ్డి డిఫాల్ట్ బెయిల్‌ను

By అంజి  Published on  5 May 2023 8:00 AM GMT
Viveka murder case, Erra Gangireddy, CBI Court

వివేకా హత్య కేసు: సీబీఐ కోర్టులో లొంగిపోయిన ఎర్ర గంగిరెడ్డి

హైదరాబాద్: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ప్రధాన నిందితుడు ఎర్ర గంగిరెడ్డి అలియాస్‌ తుమ్మలపల్లి గంగిరెడ్డి డిఫాల్ట్ బెయిల్‌ను హైకోర్టు రద్దు చేయడంతో ఈరోజు నాంపల్లి సీబీఐ కోర్టులో లొంగిపోయాడు. వివేకా హత్యలో గంగిరెడ్డి ప్రధాన పాత్ర పోషించారని, ఈ కేసులో సాక్షులను ప్రభావితం చేస్తారని వాదిస్తూ బెయిల్‌ను రద్దు చేయాలని సీబీఐ గతంలో హైకోర్టును ఆశ్రయించింది. సీబీఐ వాదనలతో ఏకీభవించిన హైకోర్టు గంగిరెడ్డిపై రెండు నెలల్లోగా దర్యాప్తు పూర్తి చేయాలని సీబీఐని ఆదేశిస్తూ జూన్ 30వ తేదీ వరకు బెయిల్‌ను రద్దు చేసింది. డిఫాల్ట్ బెయిల్‌పై బయటకు వచ్చిన గంగిరెడ్డి బెయిల్ రద్దు కావడంతో సీబీఐ కోర్టులో లొంగిపోయారు.

గంగిరెడ్డిని వివేకా హత్య కేసులో ఏపీ పోలీసులు 2019 మార్చి 28న అరెస్ట్ చేశారు. 90 రోజులు గడిచినా చార్జిషీట్ దాఖలు చేయకపోవడంతో అదే ఏడాది జూన్ 27న గంగిరెడ్డికి డిఫాల్ట్ బెయిల్ మంజూరైంది. ఏపీ పోలీసుల దర్యాప్తు ఆశించిన స్థాయిలో లేదని, కేసును సీబీఐకి అప్పగించాలని వైఎస్ వివేకా కుమార్తె ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. గంగిరెడ్డి బెయిల్‌ను రద్దు చేయాలని సీబీఐ అభ్యర్థించగా, ఆ పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. తీవ్రమైన నేరాలకు సంబంధించిన కేసుల్లో స్పష్టమైన ఆధారాలు ఉంటే డిఫాల్ట్ బెయిల్‌ను రద్దు చేయవచ్చని సీబీఐ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. మెరిట్‌పై విచారణ జరిపి పిటిషన్‌పై నిర్ణయం తీసుకోవాల్సిందిగా సీబీఐ కేసును ఏపీ హైకోర్టుకు అప్పగించింది.

తదనంతర పరిణామాల్లో వివేకా హత్య కేసు దర్యాప్తు తెలంగాణకు బదిలీ అయింది. ఈ క్రమంలో ఎర్ర గంగిరెడ్డి బెయిల్ రద్దు చేయాలంటూ సీబీఐ దాఖలు చేసిన పిటిషన్ సుప్రీంకోర్టు నుంచి ఏపీ హైకోర్టుకు, అక్కడి నుంచి తెలంగాణ హైకోర్టుకు బదిలీ అయింది. బదిలీ తర్వాత కేసు దర్యాప్తు ఊపందుకుంది. ఈ క్రమంలో ఈనెల 5లోగా సీబీఐ కోర్టులో లొంగిపోవాలని గంగిరెడ్డికి తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఏది ఏమైనప్పటికీ, తెలంగాణ హైకోర్టు అతడి బెయిల్‌ను రద్దు చేసి, మే 5లోగా లొంగిపోవాలని కోరుతూ, అలా చేయడంలో విఫలమైతే సిబిఐని అరెస్టు చేయడానికి అనుమతినిస్తూ తెలంగాణ హైకోర్టుతో పిటిషన్ చివరకు ముగిసింది. దీంతో గంగిరెడ్డి ఇవాళ కోర్టులో లొంగిపోయారు.

Next Story