'పేర్లు మార్చే పని తప్పా.. అసలైన పనిలేదు'.. ప్రభుత్వంపై బండి సెటైర్లు

ఐదు రూపాయలకే అన్నం పథకం పేరును అన్నపూర్ణ నుంచి ఇందిరా క్యాంటీన్‌గా మార్చడంపై కేంద్రమంత్రి బండి సంజయ్‌ ప్రభుత్వంపై మండిపడ్డారు.

By అంజి
Published on : 27 Jun 2025 2:56 PM IST

Union Minister Bandi Sanjay, Telangana government, Annapurna scheme

'పేర్లు మార్చే పని తప్పా.. అసలైన పనిలేదు'.. ప్రభుత్వంపై బండి సెటైర్లు

హైదరాబాద్‌: ఐదు రూపాయలకే అన్నం పథకం పేరును అన్నపూర్ణ నుంచి ఇందిరా క్యాంటీన్‌గా మార్చడంపై కేంద్రమంత్రి బండి సంజయ్‌ ప్రభుత్వంపై మండిపడ్డారు. మార్పు తెస్తామంటూ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌, పథకాల పేర్లను మాత్రమే మార్చిందని ఎద్దేవా చేశారు. ఇప్పుడు అన్నంపెట్టే అన్నపూర్ణ దేవి పేరిట ఉన్న కార్యక్రమాన్ని కూడా మార్చి, హిందువులను కించపరుస్తోందని దుయ్యబట్టారు. పేర్లు పెట్టే పనేతప్ప అసలైన పని లేదని సెటైర్లు వేశారు.

తెలంగాణ కాంగ్రెస్ మార్పుకు హామీ ఇచ్చిందని, కానీ 18 నెలల్లో అది చేసింది కేవలం పేరు మార్పు మాత్రమే అని ఎక్స్‌ వేదికగా బండి సంజయ్‌ విమర్శించారు.''విశ్వవిద్యాలయాల పేరు మార్చింది, ఆసుపత్రులు, నీటిపారుదల ప్రాజెక్టులు, అవార్డుల పేరు,ఫ్లైఓవర్ల పేరు, గృహ నిర్మాణ పథకం పేరు, వ్యవసాయ రుణ ప్రోత్సాహకాల పేరు, హరితహారం కార్యక్రమం పేరు, విభాగాల పేర్లు, అధికారిక నివాసం పేరు, తెలంగాణ తల్లి రూపం మారింది'' అని పేర్కొన్నారు. అటు అన్నపూర్ణ భోజన కేంద్రాల పేరు 'ఇందిరా క్యాంటిన్లు'గా మార్చాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని బీఆర్‌ఎస్‌, బీజేపీ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు.

హైదరాబాద్‌ సిటీలో అన్నపూర్ణ కేంద్రాలను ఇందిరా క్యాంటీన్లుగా రీబ్రాండ్ చేయడానికి జీహెచ్‌ఎంసీ స్టాండింగ్ కమిటీ నిర్ణయం తీసుకుంది. అన్నపూర్ణ కేంద్రాల వద్ద రూ.5కే భోజనం లభించేది. కాగా ఈ అన్నపూర్ణ కేంద్రాలకు ఇందిరా క్యాంటీన్లు పేరు మార్చేందుకు స్టాండింగ్ కమిటీ ఆమోదం తెలిపింది. అయితే ఇప్పటివరకే అన్నపూర్ణ క్యాంటీన్లలో మధ్యాహ్న భోజనం మాత్రమే పెడుతున్నారు. ఇక నుంచి ఇందిరా క్యాంటీన్లలో 5 రూపాయల భోజనంతో పాటు బ్రేక్ ఫాస్ట్ (టిఫిన్) అందించేందుకు కూడా స్టాండింగ్ కమిటీ ఆమోదం తెలిపింది. అదే విధంగా భోజన కేంద్రాలకు పర్మనెంట్ ప్లేస్, నిర్మాణాల పునరుద్ధరణ కు కమిటీ ఆమోదం తెలిపింది.

Next Story