టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డికి కరోనా పాజిటివ్‌

TPCC president Revanth Reddy tests covid positive.క‌రోనా మ‌హ‌మ్మారి మ‌రోసారి విజృంభిస్తోంది. కేసులు త‌గ్గిన‌ట్లే త‌గ్గి

By తోట‌ వంశీ కుమార్‌  Published on  3 Jan 2022 4:06 AM GMT
టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డికి కరోనా పాజిటివ్‌

క‌రోనా మ‌హ‌మ్మారి మ‌రోసారి విజృంభిస్తోంది. కేసులు త‌గ్గిన‌ట్లే త‌గ్గి మ‌ళ్లీ పెరుగుతున్నాయి. మ‌రో వైపు ఒమిక్రాన్ కూడా భ‌య‌పెడుతుతోంది. సామాన్యులు, సెల‌బ్రెటీలు అన్న తేడా లేకుండా అంద‌రూ ఈ మ‌హ‌మ్మారి బారిన ప‌డుతున్నారు. తాజాగా టీపీసీసీ అధ్య‌క్షుడు, ఎంపీ రేవంత్ రెడ్డికి క‌రోనా పాజిటివ్‌గా నిర్థార‌ణ అయ్యింది. ఈ విష‌యాన్ని స్వ‌యంగా ఆయ‌న సోష‌ల్ మీడియా ద్వారా వెల్ల‌డించారు.

క‌రోనా స్వ‌ల్ప ల‌క్ష‌ణాలు క‌నిపించ‌డంతో ఆయ‌న క‌రోనా ప‌రీక్ష‌లు చేయించుకున్నారు. ఈ ప‌రీక్ష‌ల్లో పాజిటివ్‌గా నిర్థార‌ణ అయ్యింది. దీంతో ఆయ‌న ఐసోలేష‌న్‌లోకి వెళ్లారు. ఇటీవ‌ల కాలంలో త‌న‌ను క‌లిసిన వారు క‌రోనా ప‌రీక్ష‌లు చేయించుకోవాల‌ని రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. అంద‌రూ కూడా క‌రోనా బారిన ప‌డ‌కుండా జాగ్ర‌త్త‌లు పాటించాల‌ని వెల్ల‌డించారు.

Next Story