ఎన్ఎస్‌యూఐ నేతల అరెస్ట్.. ఖండించిన టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌

TPCC chief Revanth condemned the arrest of NSUI leaders. మంగళవారం హైదరాబాద్‌లోని తెలంగాణ శాసనసభ బ్లాక్ దగ్గర ఎమ్మెల్యేలకు వినతిపత్రం ఇచ్చేందుకు వచ్చిన

By అంజి  Published on  6 Sep 2022 7:54 AM GMT
ఎన్ఎస్‌యూఐ నేతల అరెస్ట్.. ఖండించిన టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌

మంగళవారం హైదరాబాద్‌లోని తెలంగాణ శాసనసభ బ్లాక్ దగ్గర ఎమ్మెల్యేలకు వినతిపత్రం ఇచ్చేందుకు వచ్చిన యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్‌యూఐ నేతలను అరెస్ట్ చేయడాన్ని తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఖండించారు. సెప్టెంబర్ 6 నుంచి ప్రారంభమయ్యే శాసనసభ, మండలి వర్షాకాల సమావేశాలను అడ్డుకుంటారని భావించి హైదరాబాద్, పొరుగు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉన్న కాంగ్రెస్ నేతలను ముందస్తు అరెస్టులు చేసి పోలీసు స్టేషన్‌లకు తరలించడాన్ని రేవంత్ తప్పుబట్టారు.

యూత్ కాంగ్రెస్, ఎన్‌ఎస్‌యూఐ నేతలను వెంటనే విడుదల చేయాలని టీపీసీసీ చీఫ్ రేవంత్‌ కోరారు. పెండింగ్‌లో ఉన్న ఉద్యోగాల నోటిఫికేషన్లు, అర్హులైన లబ్ధిదారులకు నెలవారీ నిరుద్యోగ భృతి రూ.3,016 అమలుపై టీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. కాగా, శాసనమండలి, మండలి వర్షాకాల సమావేశాలకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 2 వేల మంది పోలీసులను మోహరించారు. ఎవరైనా శాసనసభ, మండలి దగ్గర సమావేశాలు, ర్యాలీలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సెప్టెంబర్ 14న సెషన్ ముగుస్తుంది.

Next Story