శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల.. టిక్కెట్‌ ధరల పెంపు.. ఎంతంటే.!

Ticket prices hiked for Sri Rama Navami bramotsavams in Bhadradri

By అంజి  Published on  23 Feb 2022 8:43 AM GMT
శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల.. టిక్కెట్‌ ధరల పెంపు.. ఎంతంటే.!

భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయ వార్షిక శ్రీరామ నవమి బ్రహ్మోత్సవాల టిక్కెట్ ధరలను పెంచుతున్నట్లు బుధవారం అధికారులు ప్రకటించారు. సెక్టార్ 1బి ధరలను రూ.5,000 నుంచి రూ.7,500కు పెంచగా, సెక్టార్ 1ఏ టికెట్ ధరలను 2,000 నుంచి రూ.2,500కు పెంచినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి శివాజీ తెలిపారు. సెక్టార్ 1సి టిక్కెట్ ధర రూ. 1,116 నుంచి రూ. 2,000కి పెరిగింది. 1డీ, 1ఈ, 1ఎఫ్‌ టిక్కెట్ ధరలను రూ. 500 నుండి రూ. 1,000 వరకు పెంచగా, 2ఏ ధరలను రూ. 1,000కు పెంచినట్లు ఈవో తెలిపారు. 2బీ, 2సీ, 2డీ, 2ఈ, 3ఏ, 3బి, 3సీలను రూ.200 నుంచి రూ.300కి పెంచారు.

అదే విధంగా 4ఏ, 4బీ, 4సీ, 4డీ, 4ఈ, 4ఎఫ్‌, 4జీ ధరలు రూ.100 నుంచి రూ.150కి పెరిగాయి. మహాపట్టాభిషేకంలో పాల్గొనేందుకు టిక్కెట్టు ధర రూ.250 నుంచి రూ.1000కు పెంచినట్లు అధికారులు తెలిపారు. భక్తులు రూ. 5వేలు చెల్లించి తపాలా ద్వారా ఐదు ముత్యాల తలంబ్రాలు, పంచె, కండువ, చీర, జాకెట్‌తో కూడిన ప్యాకెట్‌ను పొందవచ్చని, నిత్యకల్యాణంలో తమ గోత్ర నామాలతో పూజలు నిర్వహించగా, భక్తులు తలంబ్రాల ప్యాకెట్‌ను పొందవచ్చు. 1,116 చెల్లించి రెండు ముత్యాలు, కుంకుమ, ప్రసాదం, వాటి గోత్రనామాలతో పూజ చేస్తారు."అని ఈవో చెప్పారు.

Next Story