యూట్యూబర్ సన్నీ యాదవ్‌ను అదుపులోకి తీసుకున్న NIA

తన బైక్‌పై పాకిస్థాన్‌ను సందర్శించిన యూట్యూబర్ సన్నీ యాదవ్‌ను జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) అదుపులోకి తీసుకుంది.

By Medi Samrat
Published on : 29 May 2025 5:55 PM IST

యూట్యూబర్ సన్నీ యాదవ్‌ను అదుపులోకి తీసుకున్న NIA

తన బైక్‌పై పాకిస్థాన్‌ను సందర్శించిన యూట్యూబర్ సన్నీ యాదవ్‌ను జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) అదుపులోకి తీసుకుంది. గురువారం నాడు చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలో సన్నీ యాదవ్ ను అదుపులోకి తీసుకుంది. బెట్టింగ్ యాప్స్ వ్య‌వ‌హ‌రంలో ఇప్పటికే విమర్శలు ఎదుర్కొంటున్న స‌న్నీ యాద‌వ్ అనూహ్యంగా NIA అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

ప‌లు కంటెంట్ క్రియేటర్లు పాక్ కు గూడ‌చ‌ర్యం చేసిన‌ట్లు ఇటీవల నిర్దార‌ణ అయింది. ఆపరేషన్ సిందూర్ తర్వాత దేశ వ్యాప్తంగా పంజాబ్, హర్యానా, గుజరాత్, రాజస్థాన్‌లకు చెందిన పలువురిని ఎన్ఐఏ అదుపులోకి తీసుకుని విచారిస్తోంది. ఇటీవ‌లే స‌న్నీ యాద‌వ్ పాకిస్తాన్‌లో బైక్ రైడ్ చేసి వ‌చ్చిన నేప‌థ్యంలో సన్నీ యాదవ్‌ను NIA అధికారులు చెన్నై విమానాశ్రయంలో అరెస్టు చేశారు.

Next Story