హజ్ యాత్రికుల సేవకు 15 మంది ఎంపిక.. మరో ఐదుగురు రిజర్వ్
హజ్ హౌస్లో ఖాదీమ్-ఉల్-హుజ్జాజ్ (హజ్ సేవకులు) ఎంపిక కోసం తెలంగాణ రాష్ట్ర హజ్ కమిటీ బుధవారం లాటరీ డ్రాను
By అంజి Published on 20 April 2023 10:03 AM IST
హజ్ యాత్రికుల సేవకు 15 మంది ఎంపిక.. మరో ఐదుగురు రిజర్వ్
హైదరాబాద్: హజ్ హౌస్లో ఖాదీమ్-ఉల్-హుజ్జాజ్ (హజ్ సేవకులు) ఎంపిక కోసం తెలంగాణ రాష్ట్ర హజ్ కమిటీ బుధవారం లాటరీ డ్రాను నిర్వహించింది. ఈ కార్యక్రమంలో హజ్ కమిటీ చైర్మన్ మహ్మద్ సలీమ్, వక్ఫ్ బోర్డు చైర్మన్ మహ్మద్ మసీహుల్లాఖాన్, మైనారిటీల సంక్షేమ కమిషనర్, హజ్ కమిటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ బీఎస్ షఫీవుల్లా పాల్గొన్నారు. ఖాదీమ్-ఉల్-హుజ్జాజ్ ఎంపిక కోసం హజ్ కమిటీకి 165 దరఖాస్తులు వచ్చాయి, అందులో 54 దరఖాస్తులు హజ్ కమిటీ ఆఫ్ ఇండియా నిర్దేశించిన ప్రమాణాలను పాటించనందుకు తిరస్కరించబడ్డాయి. పదిహేను మంది దరఖాస్తుదారులను ఎంపిక చేసి మరో 5 మందిని రిజర్వ్లుగా ఉంచారు.
శంషాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి జూన్ రెండవ వారంలో యాత్రికులు బయలుదేరుతారు. వీరు ముందుగా జెడ్డాకు చేరుకుంటారు. అనంతరం మక్కాకు తరలిస్తారు. హజ్ కమిటీ ఆఫ్ ఇండియా విస్తారా ఎయిర్లైన్స్ను ఎంగేజ్ చేసింది. ప్రత్యేక టెర్మినల్ నుంచి యాత్రికుల బయలుదేరే ఏర్పాట్లపై జీఎంఆర్ ఎయిర్ పోర్ట్ అధికారులు కసరత్తు ప్రారంభించారు. తొలిసారిగా ప్రత్యేక కన్వేయర్ బెల్ట్ను ఏర్పాటు చేశారు. తెలంగాణ, హైదరాబాద్-కర్ణాటక, మరఠ్వాడా యాత్రికులు 15-18 విమానాలలో జెడ్డాకు బయలుదేరుతారు. తెలంగాణ నుంచి 5278 మంది యాత్రికులు హజ్ 2023కి ఎంపికయ్యారు. సెంట్రల్ పూల్ నుండి సమీప భవిష్యత్తులో మొత్తం యాత్రికుల సంఖ్య పెరిగే అవకాశాలు ఉన్నాయి.