తెలంగాణ‌లో మ‌ర‌ణ‌మృదంగం.. ఒక్క రోజే 58 మంది మృతి

new corona cases in Telangana today.తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 80,181 క‌రోనా నిర్థార‌ణ ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా.. 7,994 పాజిటివ్ కేసులు న‌మోదు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  29 April 2021 4:52 AM GMT
telangana corona cases

తెలంగాణలో క‌రోనా మ‌హ‌మ్మారి ఉగ్ర‌రూపం దాల్చింది. గడిచిన 24 గంటల్లో 80,181 క‌రోనా నిర్థార‌ణ ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా.. 7,994 పాజిటివ్ కేసులు న‌మోదు అయిన‌ట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య‌శాఖ గురువారం ఉద‌యం విడుద‌ల చేసిన హెల్త్ బులిటెన్‌లో వెల్ల‌డించింది. దీంతో రాష్ట్రంలో ఇప్ప‌టి వ‌ర‌కు న‌మోదు అయిన పాజిటివ్ కేసుల సంఖ్య 4,27,960 కి చేరింది. నిన్న 58 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ మ‌హ‌మ్మారి వ్యాప్తి రాష్ట్రంలో మొద‌లైన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు మ‌ర‌ణించిన వారి సంఖ్య 2,208కి పెరిగింది. ఒక్క రోజే 4,009 మంది కోలుకున్నారు. దీంతో ఇప్ప‌టి వ‌ర‌కు కోలుకున్న వారి సంఖ్య 3,49,692కి చేరింది. ప్ర‌స్తుతం రాష్ట్రంలో 76,060 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

రాష్ట్రంలో రిక‌వ‌రీ రేటు 81.71శాతం ఉండ‌గా.. మ‌ర‌ణాల రేటు 0.51శాతంగా ఉంది. కొత్త‌గా న‌మోదు అయిన కేసుల్లో అత్యధికంగా జీహెచ్‌ఎంసీలో 1,630 కేసులు నమోదయ్యాయి. మేడ్చల్‌లో 615, రంగారెడ్డిలో 558, నల్గొండలో 424, సంగారెడ్డిలో 337, నిజామాబాద్‌లో 301, సూర్యపేటలో 264, సిద్దిపేటలో 269, మహబూబ్‌నగర్‌లో 263, జగిత్యాలలో 238, ఖమ్మంలో 213, మంచిర్యాలలో 201 కొవిడ్‌ కేసులు రికార్డయ్యాయి. కొత్తగా నమోదైన కేసులతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 4,27,960కి పెరగ్గా.. ఇప్పటి వరకు 3,49,692 మంది కోలుకున్నారు. మహమ్మారి బారినపడి మొత్తం 2,208 మంది ప్రాణాలు విడిచారు.


Next Story