తెలంగాణలో కొనసాగుతున్న కరోనా ఉద్దృతి.. కొత్తగా ఎన్నికేసులంటే..?
Telangana reports 6026 news covid-19 cases today.తెలంగాణ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 79,824 కరోనా శాంపిళ్లను పరీక్షించగా.. కొత్తగా 6,026 పాజిటివ్ కేసులు నమోదు.
By తోట వంశీ కుమార్ Published on
6 May 2021 4:03 AM GMT

తెలంగాణ రాష్ట్రంలో కరోనా విలయం కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 79,824 కరోనా శాంపిళ్లను పరీక్షించగా.. కొత్తగా 6,026 పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ గురువారం ఉదయం విడుదల చేసిన హెల్త్ బులిటెన్లో వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 4,75,748కి చేరింది. నిన్న ఈ మహమ్మారి కారణంగా 52 మంది మరణించారు. రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి మొదలైనప్పటి నుంచి నేటి వరకు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 2,579కి చేరింది.
నిన్న 6,551 మంది కోలుకోగా.. మొత్తంగా కోలుకున్న వారి సంఖ్య 3,16,032కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 77,127 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో రికవరీ రేటు 82.91శాతంగా ఉండగా.. మరణాల రేటు 0.53శాతంగా ఉంది. కొత్తగా నమోదైన కేసుల్లో అత్యధికంగా జీహెచ్ఎంసీలో 1,115, మేడ్చల్ మల్కాజ్గిరిలో 418, రంగారెడ్డి జిల్లాలో 403 కేసులు రికార్డయ్యాయని ఆరోగ్యశాఖ తెలిపింది.
Next Story