బ్యాంకు మోసాలు.. మూడో స్థానంలో తెలంగాణ

Telangana ranks 3rd in bank frauds in first 9 months of FY 2022. 2022 ఆర్థిక సంవత్సరం మొదటి 9 నెలల్లో దేశంలో అత్యధిక

By M.S.R  Published on  24 March 2022 5:39 AM GMT
బ్యాంకు మోసాలు.. మూడో స్థానంలో తెలంగాణ

హైదరాబాద్ : 2022 ఆర్థిక సంవత్సరం మొదటి 9 నెలల్లో దేశంలో అత్యధిక బ్యాంకు మోసాలు జరిగిన మూడో రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. FY 2021-22లో మొదటి తొమ్మిది నెలల్లో రాష్ట్రంలో 88.60 కోట్ల (విలువైన) బ్యాంకు మోసాలు చోటు చేసుకున్నాయి. ఈ లిస్టులో మహారాష్ట్ర రూ. 124 కోట్లతో అగ్రస్థానంలో ఉండగా, ఢిల్లీ రూ. 93 కోట్లతో రెండో స్థానంలో ఉంది. 2021-22 ఏప్రిల్-డిసెంబర్ మధ్య కాలంలో ఆర్థిక మోసాలకు పాల్పడిన మొత్తం రూ. 648 కోట్లు అని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది.

విస్మయం కలిగించే విషయం ఏమిటంటే, తెలంగాణలో 2015 మరియు 2022 మధ్య కాలంలో రూ.13,520.38 కోట్ల వరకు బ్యాంకు మోసాలు నమోదయ్యాయి. అత్యధికంగా రూ. 4145. 73 కోట్ల మోసం 2015-16లో నమోదైంది.

2019లో దక్షిణ భారతదేశంలో జరిగిన బ్యాంకు మోసాల జాబితాలో హైదరాబాద్ నగరం అగ్రస్థానంలో ఉందని గమనించాలి. ఈ కేసులను ప్రధానంగా సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI)లోని హైదరాబాద్, బెంగళూరు, చెన్నై యూనిట్ బుక్ చేసింది. మోసగాళ్లలో జ్యువెలర్స్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కంపెనీలు, ఫార్మాస్యూటికల్స్, స్టాక్ మార్కెట్ దిగ్గజాలు ఉన్నారు. టీడీపీ మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావుకు చెందిన `ట్రాన్సిటరీ' సంస్థ మోసగాళ్ల జాబితాలో అగ్రస్థానంలో ఉంది. అందుకు సంబంధించిన మొత్తం రూ.7,926 కోట్లకు చేరుకుంది. పరారీలో ఉన్న వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీని కూడా అధిగమించాడని చెబుతున్నారు.


మోసానికి పాల్పడిన అనేక నగల వ్యాపారులలో మీనా గ్రూప్ కూడా ఉంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను రూ. 364.2 కోట్ల మేర మోసగించారని ప్రమోటర్లు ఉమేష్ జెత్వానీ, ఆయన భార్య హేమ, కుమారుడు కరణ్‌లపై సీబీఐ కేసు నమోదు చేసింది. ఎస్‌బిఐ డిజిఎం దాఖలు చేసిన ఫిర్యాదు మేరకు సిబిఐ బెంగళూరు యూనిట్ చర్యలు చేపట్టింది. 2015-19 మధ్య కాలంలో ప్రమోటర్లు కల్పిత పత్రాలపై బ్యాంకు నుండి క్రెడిట్ పొంది, బదులుగా నిధులను మళ్లించి ఆర్థిక మోసానికి పాల్పడడం జరిగింది.

హైదరాబాద్‌లో మూడు ఔట్‌లెట్‌లను కలిగి ఉన్న మీనా జ్యువెలర్స్, బంగారం, వజ్రాలు, వెండి ప్రీమియం గడియారాలు, అత్యాధునిక మొబైల్ ఫోన్‌ల వ్యాపారంలో నిమగ్నమై ఉంది. 2001లో స్థాపించబడింది. అయితే, ఆరేళ్ల తర్వాత ఇది ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా మార్చబడింది. స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ దిగ్గజం కార్వీ పేరు కూడా ఈ లిస్టులో ఉంది. కార్వీ స్టాక్ బ్రోకింగ్ ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ పార్థ సారథి ప్రస్తుతం బ్యాంకుల కొలీజియంలను మోసం చేసినందుకు విచారణను ఎదుర్కొంటున్నారు. కార్వీ స్టాక్ బ్రోకింగ్ ప్రై.లి. క్లయింట్ల సమ్మతి లేకుండా సెక్యూరిటీలు షేర్లను తాకట్టు పెట్టడం ద్వారా 137 కోట్లు రూ క్రెడిట్ సౌకర్యాలను పొందింది. తద్వారా పవర్ ఆఫ్ అటార్నీని దుర్వినియోగం చేసింది. హైదరాబాద్ సీసీఎస్ డీడీలో కేసు నమోదైంది.

నిందితులు ఖాతాదారుల నిధులను కూడా దారి మళ్లించినట్లు విచారణలో తేలింది. 720 కోట్లు వారి ట్రేడింగ్ ఖాతాలతో అనుసంధానించబడిన వారి బ్యాంకు ఖాతాలలో ఉన్నాయి. కంపెనీ అనేక ఇతర బ్యాంకులు మరియు ఎన్‌బిఎఫ్‌సిల ద్వారా ఖాతాదారుల సెక్యూరిటీలను వారి అనుమతి లేకుండా తాకట్టు పెట్టి సుమారు రూ. 680 కోట్లు సొంతం చేసుకుంది. దీనికి సంబంధించి, SEBI 2020లో కార్వీని నిషేధించింది. కంపెనీ, ఇతరులపై CCS DD హైదరాబాద్‌లో అనేక క్రిమినల్ కేసులు నమోదయ్యాయి.

M/s సర్వోమ్యాక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ బ్యాంక్ మోసం కేసులో ED ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) 13.51 కోట్ల రూపాయల కంటే ఎక్కువ విలువైన 15 స్థిరాస్తులను తాత్కాలికంగా అటాచ్ చేసింది. హైదరాబాద్‌కు చెందిన M/s సర్వోమ్యాక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (SIPL), దాని ప్రమోటర్లు/డైరెక్టర్లు వెంకటేశ్వరరావు అవసరాల, పోరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, డైరెక్టర్ ఇతరులు ప్రభుత్వ రంగ బ్యాంకులను రూ. 402 కోట్లు మోసం చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటూ ఉన్నారు.

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి వచ్చిన ఆదేశాలను అనుసరించి, బ్యాంక్ మోసాలను తనిఖీ చేయడానికి ప్రభుత్వం అనేక రకాల సంస్కరణలను ప్రారంభించింది. "ఆర్‌బిఐ డేటా ప్రకారం, గత ఆరేళ్లలో వాణిజ్య బ్యాంకుల్లో జరిగిన మోసాల మొత్తం రూ. 2,62,575 కోట్లు" అని రాష్ట్ర-ఆర్థిక మంత్రి డాక్టర్ భగవత్ కరద్ రాజ్యసభకు తెలిపారు. రికవరీ-ఆర్‌బీఐ డేటా ప్రకారం, గత ఆరు ఆర్థిక సంవత్సరాల్లో మోసగాళ్ల కు సంబంధించిన నిరర్థక ఆస్తులను అటాచ్ చేయడం ద్వారా రూ. 7,34,542 కోట్ల మొత్తాన్ని రికవరీ చేశారు.


Next Story