Telangana Polls: రూ.552 కోట్ల విలువైన నగదు, బంగారం, మద్యం స్వాధీనం

తెలంగాణలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినప్పటి నుంచి పోలీసులు రూ.552 కోట్ల విలువైన నగదు, బంగారం, మద్యం, ఉచితాలను స్వాధీనం చేసుకున్నారు.

By అంజి  Published on  14 Nov 2023 4:31 AM GMT
2023 Telangana Assembly polls, freebies, freebies seized, law enforcement agencies, liquor seized

Telangana Polls: రూ.552 కోట్ల విలువైన నగదు, బంగారం, మద్యం స్వాధీనం

హైదరాబాద్‌: ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలో అక్టోబర్‌ 9 నుంచి మోడల్‌ కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌ అమల్లోకి వచ్చినప్పటి నుంచి లా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఏజెన్సీలు దాదాపు రూ.552 కోట్ల విలువైన నగదు, బంగారం, మద్యం, ఉచితాలను స్వాధీనం చేసుకున్నాయి. ఆదివారం నుంచి సోమవారం వరకు రూ.3.70 కోట్ల విలువైన మద్యం, డబ్బులు, బంగారం, డ్రగ్స్‌ పట్టుకొన్నారు.

రూ. 188.5 కోట్ల నగదు, 292.7 కిలోల బంగారం, 1,172 కిలోల వెండి, ఇతర విలువైన వస్తువులు రూ. 178.9 కోట్లకు పైగా, రూ. 83 కోట్లకు పైగా విలువైన మద్యం, రూ. 31.2 కోట్ల విలువైన డ్రగ్స్/నార్కోటిక్స్, రూ. 31.2 కోట్ల విలువైన ఇతర వస్తువులు/ఉచితాలు 69.6 కోట్లు స్వాధీనం చేసుకున్నట్లు ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది.

అక్టోబర్ 9 (తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించినప్పటి నుండి) నవంబర్ 13 వరకు, లా ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీల మొత్తం సంచిత జప్తు విలువ రూ. 552.7 కోట్లకు పైగా ఉంటుందని పేర్కొంది. రాష్ట్రంలో నవంబర్ 30న ఎన్నికలు జరగనున్నాయి.

Next Story