గుడ్‌న్యూస్ చెప్పిన ప్రభుత్వం..సాయంత్రం నుంచి రైతుల ఖాతాల్లో డబ్బులు జమ

రెండు ఎకరాలలోపు సాగులో ఉన్న భూముల రైతులకు సాయంత్రం నుంచి రైతు బంధు డబ్బులు వారి అకౌంట్లలో జమ చేయనున్నట్లు మంత్రి తుమ్మల తెలిపారు.

By Knakam Karthik
Published on : 10 Feb 2025 4:10 PM IST

Telangana, Congress Government, Minister Thummala, RythuBharosa Funds

గుడ్‌న్యూస్ చెప్పిన ప్రభుత్వం..సాయంత్రం నుంచి రైతుల ఖాతాల్లో డబ్బులు జమ

తెలంగాణ రైతులకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శుభవార్త చెప్పారు. రెండు ఎకరాలలోపు సాగులో ఉన్న భూముల రైతులకు సాయంత్రం నుంచి రైతు బంధు డబ్బులు వారి అకౌంట్లలో జమ చేయనున్నట్లు మంత్రి తుమ్మల తెలిపారు. ఎకరాకు రూ.6 వేల చొప్పున వారి ఖాతాల్లో జమ చేయనున్నట్లు ప్రకటించారు. సాయంత్రం నుంచి పెట్టుబడి సాయం రైతుల ఖాతాల్లో జమ అవుతాయని అన్నారు. కాగా ఇప్పటికే ఒక ఎకరం ఉన్న రైతులకు నిధులు జమ చేసినట్లు ఆయన తెలిపారు. ఎకరం ఉన్న 17 లక్షల మంది రైతులకు రూ.1126 కోట్లు జమ చేసినట్లు ఆయన వెల్లడించారు.

Next Story