42 గంటల రెస్క్యూ ఆపరేషన్‌.. రాళ్ల కింద చిక్కుకున్న రాజు సేఫ్‌గా బయటకు..

Telangana man stuck under rocks rescued safely after over 42 hrs. తెలంగాణలోని కామారెడ్డి జిల్లాలో 42 గంటలకు పైగా రాళ్ల కింద చిక్కుకుపోయిన ఓ వ్యక్తిని

By అంజి  Published on  15 Dec 2022 10:08 AM GMT
42 గంటల రెస్క్యూ ఆపరేషన్‌.. రాళ్ల కింద చిక్కుకున్న రాజు సేఫ్‌గా బయటకు..

తెలంగాణలోని కామారెడ్డి జిల్లాలో 42 గంటలకు పైగా రాళ్ల కింద చిక్కుకుపోయిన ఓ వ్యక్తిని గురువారం రక్షించారు . రెస్క్యూ సిబ్బంది సుదీర్ఘ రెస్క్యూ ఆపరేషన్ తర్వాత రాజును సురక్షితంగా బయటకు తీశారు. అతడిని ఆస్పత్రికి తరలించగా ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు సమాచారం. ప్రమాదవశాత్తు జారిపడి మంగళవారం నుంచి రాళ్ల మధ్య చిక్కుకుపోయిన రాజుకు ఫ్రాక్చర్ కూడా జరగలేదని రెస్క్యూ సైట్‌లోని ఓ పోలీసు అధికారి మీడియాకు తెలిపారు. రెస్క్యూ వర్కర్లు రాళ్ల మధ్య ఖాళీని సృష్టించేందుకు ఏడు నియంత్రిత పేలుళ్లను నిర్వహించారు.

ఎల్లారెడ్డి అటవీ ప్రాంతంలో రెండు భారీ బండరాళ్ల మధ్య చిక్కుకుపోయిన వ్యక్తిని సురక్షితంగా బయటకు తీయడానికి అటవీ, పోలీసు, అగ్నిమాపక, రెవెన్యూ, ఆరోగ్య శాఖ బృందాలు శ్రమించారు. అధికారులు నాలుగు జేసీబీలను మోహరించి బండరాళ్లను తొలగించారు. రాత్రంతా ఆపరేషన్ కొనసాగిందని రెస్క్యూ వర్కర్ తెలిపారు. రాజు బయటి నుండి పాక్షికంగా కనిపించాడు. అతను సహాయం కోసం ఏడుస్తున్నాడు. సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్న అధికారులు ఓపిక పట్టాలని సూచించారు.

రెస్క్యూ వర్కర్లు కొద్దిపాటి గ్యాప్‌లో రాజుకు ఓఆర్‌ఎస్‌, నీళ్లు పంపారు. అతని రక్షణ కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్న రాజు కుటుంబ సభ్యులు, అతను మంగళవారం ఇంటికి తిరిగి రాకపోవడంతో మరియు అతని మొబైల్ ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ కావడంతో వారు అతని కోసం వెతకడం ప్రారంభించి, అతను చిక్కుకుపోయారని చెప్పారు. తొలుత స్థానికుల సాయంతో కుటుంబ సభ్యులు అతడిని రక్షించేందుకు ప్రయత్నించగా వారి ప్రయత్నాలు ఫలించకపోవడంతో పోలీసులను ఆశ్రయించారు.

Next Story