Nirmal: దుబాయ్‌లో ఉద్యోగం.. ముంబై వెళ్లిన తర్వాత వ్యక్తి అదృశ్యం

నిర్మల్ జిల్లా బీరవెల్లి గ్రామానికి చెందిన తంబకు శ్రీనివాస్ (39) అనే వ్యక్తి దుబాయ్‌లో ఉద్యోగం కోసం ఆశతో ముంబై వెళ్లి నాలుగు నెలలుగా కనిపించకుండా పోయాడు.

By అంజి
Published on : 31 Dec 2024 8:00 AM

Telangana man, missing, Mumbai trip, Dubai job

Nirmal: దుబాయ్‌లో ఉద్యోగం.. ముంబై వెళ్లిన తర్వాత వ్యక్తి అదృశ్యం

నిర్మల్ జిల్లా బీరవెల్లి గ్రామానికి చెందిన తంబకు శ్రీనివాస్ (39) అనే వ్యక్తి దుబాయ్‌లో ఉద్యోగం కోసం ఆశతో ముంబై వెళ్లి నాలుగు నెలలుగా కనిపించకుండా పోయాడు. కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం.. రూ.13 లక్షల వరకు అప్పులు చేసి ఇబ్బందులు పడుతున్న శ్రీనివాస్ మెరుగైన ఉపాధి అవకాశాల కోసం బొడ్డు సాయి అనే సబ్ ఏజెంట్‌ను సంప్రదించాడు. దుబాయ్‌లో హెల్పర్ పొజిషన్ కోసం.. సామ్ ట్రావెల్ సర్వీసెస్ అనే ఏజెన్సీకి ఏజెంట్‌ ద్వారా శ్రీనివాస్‌ రూ.75,000 చెల్లించి ఆగస్టు 5న విమానం టికెట్‌ బుక్ చేసుకున్నాడు. ఈ క్రమంలోనే శ్రీనివాస్ ఆగస్ట్ 3న ఆర్మూర్ నుండి బస్సులో బయలుదేరి ఆగస్ట్ 4న ముంబైకి వచ్చాడు.

ఆ తర్వాత ముంబైకి వచ్చినట్టు భార్య లక్ష్మికి తెలియజేశాడు. ఆ మరుసటి రోజు కుటుంబ సభ్యులకు అతనితో అన్ని సంబంధాలు తెగిపోయాయి. అతని ఫోన్ స్విచ్ ఆఫ్ చేయబడింది. ఏజెంట్‌ని పదే పదే విచారించినా సంతృప్తికరమైన సమాధానాలు రాలేదు. అతని భద్రత గురించి కుటుంబ సభ్యులు భయపడుతున్నారు. అతని కోసం వెతకడానికి వారు ముంబైకి వెళ్లారు. తరువాత విషయాన్ని సారంగాపూర్ పోలీసులకు చెప్పారు. శ్రీనివాస్‌ ఆచూకీ తెలియక నాలుగు నెలలు గడుస్తున్నా, అతని కుటుంబ సభ్యులు.. అతడు తిరిగి వస్తాడనే ఆశతో ఉన్నారు. వారు ఇటీవల వలస కార్మిక సంఘం అధ్యక్షుడు స్వదేస్ పరికిపండ్ల వద్దకు వెళ్లి కేసుకు సంబంధించి జిల్లా కలెక్టర్, పోలీసు అధికారులకు వేర్వేరుగా ఫిర్యాదు చేశారు.

Next Story