Telangana: ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారుల బదిలీలపై ఉత్తర్వులు

ఈసీ ఆదేశాలకు అనుగుణంగా ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారుల బదిలీలపై తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

By Srikanth Gundamalla  Published on  13 Oct 2023 10:37 AM GMT
telangana govt,  transfer,  IAS, IPS, officers,

Telangana: ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారుల బదిలీలపై ఉత్తర్వులు

ఎన్నికల ముందు తెలంగాణలో పలువురు ఐఏఎస్‌లను, ఐపీఎస్‌ అధికారులను ఎన్నికల సంఘం బదిలీ చేసిన విషయం తెలిసిందే. ఎన్నికల పకడ్బందీగా నిర్వహించేందుకే ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకుంది. అయితే.. తాజాగా ఖాళీగా ఉన్న పోస్టులకు నియామకాలపై రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈసీ ఆదేశాలకు అనుగుణంగా ఉత్తర్వులు జారీ అయ్యాయి. అయితే.. హైదరాబాద్‌ కమిషనర్‌ మినహాయించి అన్ని పోస్టులకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. తెలంగాణ ప్రభుత్వం పంపిన ప్యానల్‌ నుంచే ఎన్నికల సంఘం అధికారులను ఎంపిక చేసింది.

యాదాద్రి కలెక్టర్‌గా హనుమంత్‌ నియామకం అయ్యారు. నిర్మల్ కలెక్టర్‌గా ఆశీష్‌ సంగ్వాన్, రంగారెడ్డి కలెక్టర్‌గా భారతీ హోలికేరి, మేడ్చల్‌ కలెక్టర్‌గా గౌతమ్, రవాణా శాఖ ముఖ్య కార్యదర్శిగా వాణీ ప్రసాద్, ఎక్సైజ్‌, వాణిజ్య పన్నుల శాఖ ముఖ్య కార్యదర్శిగా సునీల్ శర్మ, ఎక్సైజ్‌ కమిషనర్‌గా జ్యోతి బుద్ద ప్రకాశ్, వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్‌గా క్రిస్టినాను నియమించారు. అలాగే రెండు కమిషనరేట్లకు సీపీలను.. 10 జిల్లాలకు ఎస్పీలను నియమిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి.

వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌గా అంబర్‌ కిషోర్‌ ఝా నియామకం కాగా.. నిజామాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌గా కల్మేశ్వర్‌ సింగేనేవర్‌ నియమితులయ్యారు. ఇక సంగారెడ్డి ఎస్పీగా చెన్నూరి రూపేశ్, కామారెడ్డి ఎస్పీగా సింధూ శర్మ, జగిత్యాల ఎస్పీగా సంప్రీత్‌ సింగ్, మహబూబ్‌నగర్‌ ఎస్పీగా హర్షవర్ధన్, నాగర్‌కర్నూల్‌ ఎస్పీగా వైభవ్‌ రఘునాథ్, జోగులాంబ గద్వాల ఎస్పీగా రితిరాజ్, మహబూబ్‌నగర్ ఎస్పీగా పాటిల్ సంగ్రామ్‌ సింగ్‌ గణపతి రావ్, నారాయణపేట ఎస్పీగా యోగేష్ గౌతమ్, భూపాలపల్లి ఎస్పీగా కిరణ్‌ ప్రభాకర్, సూర్యాపేట ఎస్పీగా రాహుల్‌ హెగ్డే నియామకం అయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Next Story