ఫిబ్రవరి 8న తెలంగాణలో విద్యాసంస్థలకు సెలవు: ప్రభుత్వం

తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్న అన్ని విద్యాసంస్థలకు ఫిబ్రవరి 8వ తేదీని సెలవు ప్రకటించింది.

By Srikanth Gundamalla  Published on  1 Feb 2024 9:35 AM GMT
telangana govt,  Feb 8th, holiday,

ఫిబ్రవరి 8న తెలంగాణలో విద్యాసంస్థలకు సెలవు: ప్రభుత్వం

తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్న అన్ని విద్యాసంస్థలకు ఫిబ్రవరి 8వ తేదీని సెలవు ప్రకటించింది. షబ్‌-ఇ-మెరాజ్‌ పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం విడుదల చేసిన హాలీడేస్‌ క్యాలెండర్ ప్రకారం ఫిబ్రవరి 8న షబ్‌-ఇ-మెరాజ్‌కు సెలవు ఇచ్చింది. ఇది మొదట సాధారణ సెలవు కాకుండా ఐచ్ఛిక సెలవు అని ప్రభుత్వం పేర్కొంది. కానీ.. తాజాగా సాధారణ సెలవుగా మార్చింది. కాగా.. షబ్-ఇ-మెరాజ్ ను ముస్లిములు పవిత్రమైన రోజుగా భావిస్తారు.

షబ్-ఇ-మెరాజ్ రోజు సందర్భంగా ముస్లింలు మజీద్‌లకు దీపాలతో అలంకరిస్తారు. రాత్రంతా జాగారం చేసి ప్రార్థనలు చేస్తారు. ఇస్రా, మేరాజ్‌ల కథ చెబుతారు. ఫిబ్రవరి 8న సాధారణ సెలవు అని ప్రభుత్వం తాజాగా ప్రకటించడంతో ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు మూతపడనున్నాయి. ఇక ఈ సెలవు తర్వాత ఫిబ్రవరిలో సాధారణ సెలవులు లేవు. సాధారణ పండుగలు జనవరి తర్వాత మార్చిలోనే ఉంటాయి. ప్రభుత్వం విడుదల చేసిన క్యాలెండర్ ప్రకారం మహాశివరాత్రి సందర్భంగా మార్చి 8న సాధారణ సెలవు ఉంది. మార్చి 25 హోలీ హాలీ డే ఉంది. మార్చి 29 గుడ్ ఫ్రైడే సందర్భగా సెలవు ఇచ్చారు. ఏప్రిల్ 5న బాబు జగ్జీవన్ రామ్ జయింతి సందర్భంగా హాలీడే డిక్లెర్ చేశారు. ఏప్రిల్ 9 ఉగాది సెలవు ఉంది. ఏప్రిల్ 11,12న రంజాన్ సెలవు ప్రకటించారు. ఏప్రిల్ 14న అంబేడ్కర్ జయంతి సందర్భంగా హాలీడే ఉంది. ఏప్రిల్ 17 శ్రీరామనవమికి కూడా సెలవు ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం.

ఇక మిగతా సెలవులను కూడా పరిశీలిస్తే.. జూన్ 17 బక్రీద్ సెలవు. జూలై 17న మెహ్రం సెలవు. బోనాల సందర్భంగా జూలై 29న సెలవు ప్రకటించారు. ఆ తర్వాత ఆగస్టు 15 స్వాతంత్య్ర దినోత్సవం. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఆగస్టు 26న సెలవు ఇచ్చారు. సెప్టెంబర్ 7న వినాయక చవితి హోలీ రోజు సెలవు ప్రకటించారు. సెప్టెంబర్ 16న ఈద్ నబీకి సెలవు ఇచ్చారు. అక్టోబర్ 2న మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా సెలవు కాగా.. అక్టోబర్ 12, 13 తేదీల్లో దసరా సెలవులు ఉంటాయి. మళ్లీ అక్టోబర్ 31 దీపావళి సెలవు ఇచ్చారు. గురునానక్ జయంతి సందర్భంగా నవంబర్ 15 సెలవు ఇవ్వగా... డిసెంబర్ 25, 26 క్రిస్మస్ సెలవులుగా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది.

Next Story