తెలంగాణ ఉద్యోగులకు గుడ్ న్యూస్..రూ.745 కోట్ల పెండింగ్ బిల్లుల విడుదల

ప్రభుత్వ ఉద్యోగులకు పెండింగ్‌లో ఉన్న వివిధ రకాల బిల్లులను క్లియర్ చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం తాజాగా రూ. 745 కోట్లను విడుదల చేస్తూ నిర్ణయం తీసుకుంది.

By -  Knakam Karthik
Published on : 27 Feb 2026 10:41 AM IST

Telangana Government, Deputy Chief Minister, Mallu Bhatti Vikramarka, Employees Pending Bills PendingBills, EmployeeWelfare

తెలంగాణ ఉద్యోగులకు గుడ్ న్యూస్..రూ.745 కోట్ల పెండింగ్ బిల్లుల విడుదల

తెలంగాణలోని ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ఎంతో కాలంగా పెండింగ్‌లో ఉన్న వివిధ రకాల బిల్లులను క్లియర్ చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం తాజాగా రూ. 745 కోట్లను విడుదల చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. గత జూన్ నెల నుండి ఉద్యోగ సంఘాలకు ఇచ్చిన హామీ ప్రకారం, ప్రభుత్వం ప్రతి నెలా సుమారు రూ. 700 కోట్లను పెండింగ్ బిల్లుల కోసం కేటాయిస్తూ వస్తోంది.

ఇందులో భాగంగానే ఈ నెల రూ. 745 కోట్లు మంజూరు చేశారు. ఉద్యోగులతో పాటుగా, గ్రామ పంచాయతీల నిర్వహణ మరియు అభివృద్ధి కోసం ఆర్థిక శాఖ అధికారులు రూ. 389 కోట్లను కూడా విడుదల చేశారు. ఈ నిధుల విడుదలతో పెండింగ్‌లో ఉన్న మెడికల్ బిల్లులు, జీపీఎఫ్ (GPF) మరియు ఇతర అడ్వాన్స్‌లు త్వరితగతిన చెల్లించే అవకాశం ఉంటుంది.

Next Story