రెండో దశలో.. 3.38 లక్షల మంది లబ్ధిదారులకు గొర్రెల యూనిట్లు.!

హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం రెండో దశ గొర్రెల పంపిణీ కార్యక్రమం కింద 3.38 లక్షల మంది లబ్ధిదారులకు గొర్రెల

By అంజి  Published on  7 April 2023 2:17 AM GMT
Telangana government,  sheep units, beneficiaries

రెండో దశలో.. 3.38 లక్షల మంది లబ్ధిదారులకు గొర్రెల యూనిట్లు.!

హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం రెండో దశ గొర్రెల పంపిణీ కార్యక్రమం కింద 3.38 లక్షల మంది లబ్ధిదారులకు గొర్రెల యూనిట్లను పంపిణీ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. గురువారం జిల్లా కలెక్టర్లు, ఇతర అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎ శాంతికుమారి గొర్రెల యూనిట్ల సేకరణ, రవాణా, లబ్ధిదారుల నుంచి డిపాజిట్లు వసూలు చేసేందుకు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని ఆదేశించారు.

రెండోదశలో 3.38 లక్షల మందికి గొర్రెల పంపిణీ లక్ష్యానికి అనుగుణంగా ప్రణాళిక సిద్ధం చేయాలని ఆమె తెలిపారు . గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని ఆయా జిల్లాల కలెక్టర్ల నేతృత్వంలో నిర్వహించాలని, అత్యధికంగా లబ్ధిదారులు ఉన్న 12 జిల్లాల కలెక్టర్లు ప్రత్యేక చర్యలు చేపట్టాలని కోరారు. ఏప్రిల్ 14న 125 అడుగుల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణకు జిల్లా కలెక్టర్లు తమ జిల్లాల ప్రజలతో కలిసి రావాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశించారు.

Next Story