200 కొత్త అంబులెన్స్‌లను కొనుగోలు చేయనున్న తెలంగాణ సర్కార్‌

సంగారెడ్డి: 3 లక్షల కిలోమీటర్లకు పైగా నడిచిన పాత అంబులెన్స్‌ల స్థానంలో కొత్తగా 200 '108' అంబులెన్స్‌లను రాష్ట్ర ప్రభుత్వం

By అంజి  Published on  11 April 2023 7:10 AM GMT
108 ambulances, Telangana government, Harish rao

200 కొత్త అంబులెన్స్‌లను కొనుగోలు చేయనున్న తెలంగాణ సర్కార్‌

సంగారెడ్డి: 3 లక్షల కిలోమీటర్లకు పైగా నడిచిన పాత అంబులెన్స్‌ల స్థానంలో కొత్తగా 200 '108' అంబులెన్స్‌లను రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయనున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. మంగళవారం జిల్లా పరిషత్‌ సమావేశంలో మునిపల్లి ఎంపీపీ శైలజ తన మండలంలో పాత అంబులెన్స్‌ను మార్చాలని మంత్రికి విన్నవించగా, '108' అంబులెన్స్‌ సేవలపై హైదరాబాద్‌లో సమీక్షా సమావేశం నిర్వహించినట్లు వైద్యారోగ్యశాఖ మంత్రి తెలిపారు. . ఆరోగ్య శాఖ ఇప్పటికే 200 కొత్త అంబులెన్స్‌లకు ఆర్డర్ ఇచ్చిందని, 45 రోజుల్లో కొత్త '108' అంబులెన్స్‌లు సేవలను అందించనున్నట్లు ఆయన తెలిపారు. తెలంగాణలో 3 లక్షల కిలోమీటర్లకు పైగా ప్రయాణించిన 200 అంబులెన్స్‌లను గుర్తించినట్లు మంత్రి తెలిపారు. సంగారెడ్డిలో మహాత్మా జ్యోతిరావు ఫూలే జయంతి వేడుకల్లో మంత్రి పాల్గొన్నారు.

Next Story