తెలంగాణలో కొత్తగా 502 పాజిటివ్‌ కేసులు

Telangana corona cases .. తెలంగాణలో కొత్తగా 502 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, ముగ్గురు మృతి చెందారు. గడిచిన 24 గంటల్లో

By సుభాష్  Published on  1 Dec 2020 3:34 AM GMT
తెలంగాణలో కొత్తగా 502 పాజిటివ్‌ కేసులు

తెలంగాణలో కొత్తగా 502 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, ముగ్గురు మృతి చెందారు. గడిచిన 24 గంటల్లో 894 మంది కరోనా నుంచి కోలుకోగా, ఇప్పటి వరకు రాష్ట్రంలో 2,59,230 మంది కోలుకున్నారు. ఇక ఇప్పటి వరకు రాష్ట్రంలో 2,70,318 మంది కరోనా బారిన పడగా, మొత్తం 1461 మంది మృతి చెందినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.

ఇక రాష్ట్రంలో యాక్టివ్‌ కేసుల సంఖ్య 9,627 ఉండగా, హొం ఐసోలేషన్‌లో 7,586 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 55,00,058 మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్లు వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. తాజాగా అత్యధికంగా జీహెచ్‌ఎంసీలో 101 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.

Next Story