ముస్లింలకు 8 శాతం రిజర్వేషన్లు కల్పించాలి: తెహ్రీక్ ముస్లిం షబ్బాన్

Tehreek Muslim Shabban seeks eight pc reservations to Muslims before polls. హైదరాబాద్: రాష్ట్రంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికలలోపు ముస్లింలకు ఎనిమిది శాతం రిజర్వేషన్లు కేటాయించాలని

By అంజి  Published on  15 Feb 2023 5:15 AM GMT
ముస్లింలకు 8 శాతం రిజర్వేషన్లు కల్పించాలి: తెహ్రీక్ ముస్లిం షబ్బాన్

హైదరాబాద్: రాష్ట్రంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికలలోపు ముస్లింలకు ఎనిమిది శాతం రిజర్వేషన్లు కేటాయించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని నగరానికి చెందిన తెహ్రీక్ ముస్లిం షబ్బాన్ అనే సంస్థ మంగళవారం కోరింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఎనిమిదేళ్లు గడిచినా ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామన్న హామీని ప్రభుత్వం నెరవేర్చలేదు. 12 శాతం కాకపోతే, ముస్లింలకు కనీసం ఎనిమిది శాతం రిజర్వేషన్లను బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఆమోదించాలి అని తెహ్రీక్ ముస్లిం షబ్బాన్ అధ్యక్షుడు ముస్తాక్ మాలిక్ అన్నారు.

ముస్లింలను విస్మరించినందుకు ప్రభుత్వాన్ని మాలిక్ ప్రశ్నించారు. "రాష్ట్ర ప్రభుత్వం ఎస్టీలకు రిజర్వేషన్ కోటాలను ఆరు శాతం నుండి 10 శాతానికి పెంచింది, అయితే ముస్లిం రిజర్వేషన్లకు సంబంధించి అలాంటి ప్రకటన చేయలేదు" అని అన్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం తన ఎన్నికల మ్యానిఫెస్టోలో 12 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చింది, కానీ హామీని అమలు చేయడంలో లేదా నెరవేర్చడంలో విఫలమైందని ముస్తాక్ మాలిక్ అన్నారు. కీలకమైన ప్రభుత్వ శాఖలు, పబ్లిక్ సర్వీస్ కమిషన్‌లో ముస్లింల ప్రాతినిధ్యం లేకపోతే ముస్లింల నియామకం ఎలా చేస్తారని ప్రశ్నించారు.

ప్రభుత్వం వివిధ యూనివర్శిటీల్లో 10 మంది వైస్ ఛాన్సలర్లను నియమించిందని, అయితే ముస్లిం వర్గానికి చెందిన వారు ఎవరూ లేరని అన్నారు. 66 మంది ఉర్దూ అధికారుల నియామకం మినహా ముస్లింల సంక్షేమానికి ప్రభుత్వం చేసింది చాలా తక్కువ అని అన్నారు. ప్రభుత్వం కేటాయించిన 2బిహెచ్‌కె అపార్ట్‌మెంట్లలో నాలుగు శాతం ముస్లింలు కూడా భాగం కాలేదని, రాష్ట్రంలో కేవలం 1.43% ముస్లింలు మాత్రమే గెజిటెడ్ ఆఫీసర్ పోస్టులను పొందగలిగారని ఆయన తెలిపారు.

"దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న 2, 16,000 మందికి పైగా దరఖాస్తుదారులకు తలకు లక్ష రూపాయల చొప్పున ఆర్థిక సహాయం మంజూరు చేయడానికి ప్రాధాన్యత ఇవ్వండి", యువత నిరుద్యోగంపై పోరాడటానికి సహాయం చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. తెలంగాణ సెక్రటేరియట్ కాంప్లెక్స్ లోపల మసీదుల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని, మైనారిటీ కమిషన్ ఛైర్మన్‌గా ముసిం అభ్యర్థిని నియమించాలని, పబ్లిక్ సర్వీస్ కమిషన్‌లో వారి ప్రాతినిధ్యం పెంచాలని ముస్తాక్ మాలిక్ ప్రభుత్వాన్ని అభ్యర్థించారు.

Next Story