కారుని ఢీకొట్టిన రెండు లారీలు.. ఇద్దరు మృతి, బాలుడి నరకయాతన

సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది.

By Srikanth Gundamalla  Published on  9 Jun 2024 6:06 PM IST
sangareddy, road accident, two dead, boy injured,

కారుని ఢీకొట్టిన రెండు లారీలు.. ఇద్దరు మృతి, బాలుడి నరకయాతన

సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. కంది దగ్గర జాతీయ రహదారిపై ఒక కారును రెండు లారీలు ఢీకొట్టాయి. దాంతో ఈ ప్రమాదంలో కారు నుజ్జునుజ్జు అయ్యింది. ఈ ఘటనలో కారులో ఉన్న ఇద్దరు స్పాట్‌లోనే ప్రాణాలు కోల్పోయారు. అదే కారులో ఉన్న మరో బాలుడు నుజ్జు నుజ్జు అయిన కారులో ఇరుక్కున్నాడు. గాయాలపాలై నరకయాతన అనుభవించాడు. స్థానికులు.. ఇతర వాహనదారులు బాలుడిని బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేసినా సఫలం కాలేదు. దాంతో.. పోలీసులకు సమాచారం అందించడంతో వారు వెంటనే అక్కడికి చేరుకున్నారు. దాదాపు రెండు గంటల తర్వాత కారులో ఇరుక్కున్న బాలుడిని బయటకు తీశారు పోలీసులు. జేసీబీలు, గునపాల సాయంతో అతి కష్టం మీద బాలుడిని బయటకు తీశారు. ఇక ఆ తర్వాత వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం బాలుడు చికిత్స పొందుతున్నట్లు తెలుస్తోంది. అయితే.. ఈ ప్రమాదం ఎలా జరిగిందనే విషయం తెలియాల్సి ఉంది.

రోడ్డు ప్రమాదం జరిగిన తర్వాత అక్కడ భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. చాలా సేపు వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. వాహనాలు నిలిచిపోయాయి. దూరంలో ఉన్న వాహనాదారులు రోడ్డుప్రమాదం గురించి తెలియక ఇబ్బందులు పడ్డారు. ఇక పోలీసులు కారుని.. రెండు లారీలను జాతీయ రహదారిపై నుంచి పక్కకు తీయడంతో ట్రాఫిక్‌ క్లియర్ అయ్యింది. నిర్లక్ష్యపు డ్రైవింగ్ ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.


Next Story