విషాదం.. మహిళా సర్పంచ్‌ కన్నుమూత.. బాధ్యతలు చేపట్టిన 48 గంటల్లోపే..

ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్‌గా ఎన్నికైన ఎర్రోళ్ల అక్కమ్మ 48 గంటల కంటే తక్కువ కాలం మాత్రమే తన పదవిలో కొనసాగారు.

By -  అంజి
Published on : 25 Dec 2025 10:39 AM IST

Sangareddy, woman sarpanch died of illness, gram panchayat elections, Mirzapur

విషాదం.. మహిళా సర్పంచ్‌ కన్నుమూత.. బాధ్యతలు చేపట్టిన 48 గంటల్లోపే..

ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్‌గా ఎన్నికైన ఎర్రోళ్ల అక్కమ్మ 48 గంటల కంటే తక్కువ కాలం మాత్రమే తన పదవిలో కొనసాగారు. ఆమె బుధవారం తన నివాసంలో అనారోగ్యంతో మరణించారు. సంగారెడ్డి జిల్లా న్యాల్కల్‌ మండలం మీర్జాపూర్‌లో ఈ ఘటన జరిగింది. మీర్జాపూర్‌ సర్పంచ్‌గా ఎన్నికైన అక్కమ్మ.. అనారోగ్య సమస్యల కారణంగా తన నివాసంలో మరణించారు. 58 ఏళ్ల మహిళ అక్కమ్మ కాంగ్రెస్ పార్టీ మద్దతుతో 141 ఓట్ల మెజారిటీతో సర్పంచ్‌గా ఎన్నికయ్యారు.

ఆమె సోమవారం గ్రామ పంచాయతీ ఆవరణలో వార్డు సభ్యులతో కలిసి ప్రమాణ స్వీకారం చేశారు. అయితే, ఆరోగ్యం క్షీణించిన అక్కమ్మ బుధవారం తన నివాసంలో తుది శ్వాస విడిచారు. ఇది మొత్తం గ్రామాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. సర్పంచ్ మరణంతో ఎన్నికల అధికారులు త్వరలో గ్రామంలో సర్పంచ్ పదవికి తిరిగి ఎన్నిక నిర్వహించనున్నారు.

Next Story