సద్దుల బతుకమ్మ సందర్భంగా రేపు హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు

అక్టోబర్‌ 22న సద్దుల బతుకమ్మ సందర్భంగా హైదరాబాద్‌ నగరవాసులకు పోలీసులు అలర్ట్‌ ప్రకటించారు.

By Srikanth Gundamalla  Published on  21 Oct 2023 3:23 AM GMT
saddula bathukamma, traffic, restrictions,  hyderabad,

సద్దుల బతుకమ్మ సందర్భంగా రేపు హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు

తెలంగాణ వ్యాప్తంగా బతుకమ్మ సంబరాలు కొనసాగుతున్నాయి. అయితే.. అక్టోబర్‌ 22న సద్దుల బతుకమ్మ జరగనుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌ నగరవాసులకు పోలీసులు అలర్ట్‌ ప్రకటించారు. పలు రూట్లలో ట్రాఫిక్ ఆంక్షలు ఉండనున్నాయనని.. ఆయా రూట్లలో వెళ్లేవారు గమనించాలని సూచించారు. ఈ సందర్భంగా మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు లుంబినీ పార్కు, అప్పర్‌ ట్యాంక్‌ బండ్‌పై ట్రాఫిక్‌ ఆంక్షలు ఉంఆయని నగర ట్రాఫిక్‌ అదనపు సీపీ సుధీర్‌బాబు వెల్లడించారు. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలని సూచించారు.

తెలుగుతల్లి ఫ్లై ఓవ‌ర్, కర్బాలా మైదాన్‌ వైపు నుంచి వచ్చే వాహనాలకు ట్యాంక్‌బండ్ మీదుగా మధ్యాహ్నాం 2 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు అనుమతి లేదని పోలీసులు చెప్పారు. సికింద్రాబాద్‌ నుంచి ట్యాంక్‌బండ్ పైకి వచ్చే వాహనాలను కర్బాలా మైదాన్‌ వద్ద బైబిల్‌ హౌస్‌ మీదుగా తెలుగు తల్లి ఫ్లై ఓవ‌ర్ వైపు డైవర్ట్ చేయనున్నారు. ఎక్బాల్‌ మినార్‌ నుంచి వచ్చే వాహనాలను, తెలుగు తల్లి ఫ్లై ఓవ‌ర్ వైపు మళ్లించనున్నారు. పంజాగుట్ట, రాజ్‌భవన్‌ రోడ్డులో నుంచి ఖైరతాబాద్ ఫ్లై ఓవ‌ర్‌ మీదుగా వచ్చే వాహనాలను నెక్లెస్‌ రోటరీ ఇందిరాగాంధీ విగ్రహాం వద్ద ఐమాక్స్‌ రూట్‌లోకి డైవర్ట్ చేస్తారు.

అలాగే నల్లగుట్ట నుంచి బుద్ధ భవన్‌ వైపు వాహనాలను అనుమతించమని పోలీసులు వెల్లడించారు. నల్లగుట్ట క్రాస్‌రోడ్డు వద్ద రాణిగంజ్, నెక్లెస్‌ రోడ్డువైపు ఈ వాహనాలను డైవర్ట్‌ చేయనున్న పోలీసులు చెప్పారు. ఇక హిమాయత్‌నగర్‌, బషీర్‌బాగ్‌, అంబేద్కర్‌ విగ్రహం వైపు నుంచి ట్యాంక్‌బండ్‌ పైకి వాహనాలను అనుమతి ఉండదన్నారు పోలీసులు. ఈ రూట్లో వెళ్లాల్సిన వాహనాలను ఇక్బాల్ మినార్‌ వైపు వెళ్లి యూ టర్న్ తీసుకోవాలని.. తెలుగు తల్లి జంక్షన్, తెలుగుతల్లి ఫ్లై ఓవర్‌ పైనుంచి వెళ్లాల్సి ఉంటుందని హైదరాబాద్ ట్రాఫిక్‌ పోలీసులు చెప్పారు. ఇక ముషీరాబాద్ నుంచి ట్యాంక్‌బండ్‌ వైపు వచ్చే వాహనదారులను కవాడిగూడ క్రాస్‌రోడ్డు వద్ద పోలీసులు మళ్లించనున్నారు. సికింద్రాబాద్ వచ్చే వాహనాలను అప్పర్‌ ట్యాంక్‌బండ్‌ పైకి అనుమతి లేదని ట్రాఫిక్ పోలీసులు చెప్పారు. ఆ వాహనాలను డీబీఆర్ మిల్స్ వద్ద కట్ట మైసమ్మ ఆలయం, తెలుగు తల్లి ఫ్లైఓవర్‌ వైపు డైవర్ట్ చేయనున్నారు.

అలాగే ఇతర జిల్లాల నుంచి వచ్చే ఆర్టీసీ బస్సులను జేబీఎస్ జేబీఎస్‌ స్వీకార్‌-ఉపకార్‌ వద్ద డైవర్ట్ చేయనున్నారు. సిటీ బస్సులను కర్బాలా మైదాన్‌ వద్ద మళ్లిస్తారు. బతుకమ్మ సంబురాలకు వచ్చే వారికి స్నో వరల్డ్‌, ఎన్టీఆర్‌ స్టేడియం, ఎన్టీఆర్‌ గార్డెన్‌ పక్కనే పార్కింగ్‌ స్థలాలను కేటాయించారు. ఇవన్నీ చూసుకుని వాహనదారులు ఇబ్బందులు పడకుండా ముందస్తుగా చూసుకోవాలని హైదరాబాద్ నగర ట్రాఫిక్‌ పోలీసులు సూచించారు.

Next Story