కామారెడ్డిలో ఆర్టీసీ బస్సు బోల్తా.. 10 మందికి గాయాలు

RTC bus overturns in Kamareddy district.. 10 people injured. కామారెడ్డి జిల్లా కేంద్రంలో ప్రమాదం చోటు చేసుకుంది. బాన్సువాడ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు కామారెడ్డి నుంచి నిజామాబాద్

By అంజి  Published on  13 Aug 2022 8:01 AM GMT
కామారెడ్డిలో ఆర్టీసీ బస్సు బోల్తా.. 10 మందికి గాయాలు

కామారెడ్డి జిల్లా కేంద్రంలో ప్రమాదం చోటు చేసుకుంది. బాన్సువాడ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు కామారెడ్డి నుంచి నిజామాబాద్ వెళ్తుండగా ప్రమాదం జరిగింది. జిల్లా కేంద్రంలోని పాత కలెక్టరేట్‌ ఎదుట అదుపు తప్పి బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న 10 మందికిపైగా గాయపడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాద స్థలంలో ఉన్న కొంతమంది స్థానికుల సహాయంతో బస్సు అద్దాలను పగులకొట్టి ప్రయాణికులను అందులోనుంచి బయటకు తీశారు.

ఈ ప్రమాదంలో ఎవరికీ ప్రాణహాని జరగలేదు. దీంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. గాయపడిన వారిని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బస్సు నడుపుతుండగా డ్రైవర్‌కు కళ్లు తిరిగాయని, ఈ క్రమంలోనే బస్సు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టి బోల్తా పడిందని పోలీసులు తెలిపారు. గత రెండు, మూడు రోజులుగా బస్సు డ్రైవర్‌ జ్వరంతో బాధపడుతున్నట్లు తెలిసింది. ప్రమాదం జరిగినప్పుడు బస్సులో 29 మంది ప్రయాణికులు ఉన్నారని, ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు చెప్పారు.

Next Story