భద్రాద్రి శ్రీరామ నవమి టిక్కెట్ల ఆన్‌లైన్ విక్రయం ప్రారంభం

Online sale of tickets for Bhadradri Sri Rama Navami begins. భద్రాద్రి శ్రీ సీతా రామచంద్ర స్వామి దేవస్థానం వార్షిక శ్రీరామ నవమి బ్రహ్మోత్సవాలలో పాల్గొనేందుకు సెక్టార్ టిక్కెట్ల ఆన్‌లైన్ విక్రయం

By అంజి  Published on  3 March 2022 1:42 PM GMT
భద్రాద్రి శ్రీరామ నవమి టిక్కెట్ల ఆన్‌లైన్ విక్రయం ప్రారంభం

భద్రాద్రి శ్రీ సీతా రామచంద్ర స్వామి దేవస్థానం వార్షిక శ్రీరామ నవమి బ్రహ్మోత్సవాలలో పాల్గొనేందుకు సెక్టార్ టిక్కెట్ల ఆన్‌లైన్ విక్రయం గురువారం ప్రారంభమైంది. ఏప్రిల్ 10న జరగనున్న 'తిరుకల్యాణ మహోత్సవం', ఏప్రిల్ 11న 'మహా పట్టాభిషేకం మహోత్సవం' టిక్కెట్లను విక్రయిస్తున్నారు. భక్తులు టిక్కెట్లను బుక్ చేసుకోవడానికి ఆలయ వెబ్‌సైట్ www.bhadrachalamonline.comని సందర్శించవచ్చు. రూ.7500, రూ.2500, రూ.2000, రూ.1000, రూ.300, రూ.150ల టిక్కెట్లు విక్రయానికి అందుబాటులో ఉన్నాయని ఆలయ కార్యనిర్వహణాధికారి (ఈవో) బి శివాజీ ఒక ప్రకటనలో తెలిపారు. పట్టాభిషేకం కోసం 1000 రూపాయల టిక్కెట్లు కూడా అందుబాటులో ఉన్నాయి.

దానికి తోడు పనివేళల్లో దేవస్థానం కార్యాలయంలో రూ.7500 విలువైన 'శ్రీరామ నవమి కళ్యాణౌభయం' టిక్కెట్లను విక్రయిస్తారు. ఆసక్తిగల భక్తులు మరిన్ని వివరాల కోసం ఫోన్ నంబర్: 08743-232428ను సంప్రదించవచ్చని ఆయన తెలిపారు. కాగా, దేవస్థానం అధికారులు సేవా, పూజల ధరలను పెంచగా, పెంచిన ధరలు శుక్రవారం నుంచి అమల్లోకి రానున్నాయి.

పెరిగిన ధరలు ఇలా ఉన్నాయి: మూలవరుల అభిషేకం (ప్రతి ఆదివారం) రూ.1500, నిత్య కల్యాణం-రూ.1500, అర్చన-రూ.300, సుబ్రభాత సేవ-రూ.200, పవళింపు సేవ-రూ.200, సహస్ర నామార్చన-రూ.500. అన్నప్రాసన, అక్షరాభ్యాసం తదితర పూజా కార్యక్రమాలకు భక్తులు రూ.516 చెల్లించాల్సి ఉండగా వాహన పూజ (ద్విచక్ర వాహనాలకు) రూ.216లు చెల్లించాల్సి ఉంటుందని ఈఓ తెలిపారు.

Next Story