ముగిసిన మునుగోడు ఉప ఎన్నిక.. 77.5% ఓటింగ్ శాతం నమోదు

Munugode by-election concluded.. 77.5% voting percentage recorded. హైదరాబాద్: మునుగోడు ఉప ఎన్నిక గురువారం సాయంత్రం 6 గంటలకు ముగియగా మొత్తం 77.55 శాతం ఓటింగ్

By అంజి  Published on  3 Nov 2022 3:52 PM GMT
ముగిసిన మునుగోడు ఉప ఎన్నిక.. 77.5% ఓటింగ్ శాతం నమోదు

మునుగోడు ఉప ఎన్నిక గురువారం సాయంత్రం 6 గంటలకు ముగియగా మొత్తం 77.55 శాతం ఓటింగ్ నమోదైంది. అంతకుముందు తెలంగాణ ఎన్నికల ప్రధాన అధికారి 90% పోలింగ్‌ నమోదవుతుందని అంచనా వేశారు. ఫలితాలను నవంబర్ 6న ప్రకటించాలని నిర్ణయించారు. ఉప ఎన్నికలకు ముందు.. పౌరులు ఓటు వేయడానికి డబ్బు చెల్లించనందున వారి ఆసక్తిని వ్యక్తం చేస్తూ అనేక వీడియోలు ఆన్‌లైన్‌లో ప్రసారం అవుతున్నాయి. రాజకీయ పార్టీలు తమకు ఓటు వేయడానికి ఓటర్లకు డబ్బులిచ్చాయని కొన్ని వీడియోలు సోషల్‌ మీడియాలో కనిపించాయి.

తెలంగాణ రాష్ట్ర ఎన్నికల అధికారి వికాస్ రాజ్ మాట్లాడుతూ.. పోలింగ్ రోజున మునుగోడులో ఉన్న ఓటర్లు కాని (బయటి వ్యక్తులు) ఫిర్యాదులతో పోలీసులకు దాదాపు 38 కాల్స్ వచ్చాయని తెలిపారు. గురువారం మధ్యాహ్నం లోపు దాదాపు 42 మందిని గుర్తించి నియోజకవర్గం నుంచి బయటకు పంపినట్లు తెలిపారు. అంతకుముందు.. మునుగోడులో నమోదైన ఓటర్లు కాకుండా అనధికార వ్యక్తులందరూ మంగళవారం సాయంత్రం 6 గంటలలోపు వెళ్లిపోవాలని వికాస్ రాజ్ కోరారు. అదనంగా 28 కేసులు రెవెన్యూ బృందానికి నమోదయ్యాయి. తనిఖీ చేయగా.. రెండు చోట్ల నగదు దొరికింది. మొత్తంగా రూ.2,99,000 స్వాధీనం చేసుకున్నట్లు వికాస్‌ రాజ్ తెలిపారు.

"మాక్ పోల్స్ ప్రారంభమైన తర్వాత.. మునుగోడు నియోజకవర్గంలో కొన్ని వీవీ ప్యాట్‌ యంత్రాలు, కంట్రోల్ యూనిట్లలో కొన్ని సమస్యలు వచ్చాయి. అయితే ఆ సమస్యలు తక్కువ సమయంలోనే పరిష్కరించబడ్డాయి. దీనివల్ల కొన్ని చోట్ల పోలింగ్ తాత్కాలికంగా ఆగిపోయింది." అయితే అవి సజావుగా కొనసాగాయని ఆయన తెలిపారు.

ప్రత్యేక నిఘా

నియోజకవర్గంలో బయటి వ్యక్తుల సంఖ్యను తగ్గించేందుకు 45 పోలీసు బృందాలు, 37 రెవెన్యూ బృందాలను నియమించారు. ఓటర్లకు నగదు పంపిణీ లేదా ఇతర ప్రేరేపణలపై నిఘా ఉంచేందుకు బృందాలు గ్రామాల్లో పర్యటించాయి. అభ్యర్థులు, రాజకీయ పార్టీల వ్యయ సంబంధిత కార్యకలాపాలను పర్యవేక్షించడానికి ఏడుగురు సభ్యులతో కూడిన ఆదాయపు పన్ను బృందాన్ని నియమించారు. మునుగోడులో దాదాపు 3,366 మంది రాష్ట్ర పోలీసులు, 15 కంపెనీల కేంద్ర సాయుధ పోలీసు బలగాలను మోహరించారు. అదనంగా, ఇతర ప్రాంతాల నుండి పురుషులు, సామగ్రి తరలింపును పర్యవేక్షించడానికి నియోజకవర్గ వ్యాప్తంగా 100 చెక్‌పోస్టులను ఏర్పాటు చేశారు. అలాగే పోలింగ్ కేంద్రాల వద్ద 1,492 మంది అధికారులను నియమించారు. వెబ్‌కాస్టింగ్ కూడా ఏర్పాటు చేశారు.

ఉప ఎన్నిక ఎందుకు?

ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆగస్టు 8న రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలో చేరారు. ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి కూడా ఆయనే. మునుగోడు నల్గొండ జిల్లాలోని భోంగిర్ లోక్‌సభ పార్లమెంటరీ నియోజకవర్గంలో భాగంగా ఉంది. నియోజకవర్గంలో 1,21,720 మంది పురుషులు, 1,20,128 మంది మహిళలు, ఏడుగురు ట్రాన్స్‌జెండర్లు సహా 2,41,855 మంది ఓటర్లు ఉన్నారు.

Next Story