నిర్మలమ్మకు కవిత ట్వీట్.. సుత్తిలేకుండా సూటిగా చెప్పండి

MLC Kavitha question to Union Minister Nirmala Sitharaman.కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌వేశ పెట్టిన బ‌డ్జెట్‌పై తెలంగాణ

By తోట‌ వంశీ కుమార్‌  Published on  3 Feb 2022 6:34 AM GMT
నిర్మలమ్మకు కవిత ట్వీట్.. సుత్తిలేకుండా సూటిగా చెప్పండి

కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌వేశ పెట్టిన బ‌డ్జెట్‌పై తెలంగాణ ప్ర‌భుత్వం మండిప‌డుతూనే ఉంది. ఈ క్రమంలో ఎమ్మెల్సీ కవిత సోష‌ల్ మీడియా వేదిక‌గా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌పై ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపించారు. సీఎం కేసీఆర్ గారి ప్రశ్నకు సుత్తి లేకుండా సూటిగా సమాధానం చెప్పాలన్నారు. లాభాల్లో ఉన్న ఎల్ఐసీని ఎందుకు అమ్ముతున్నారు? అని కవిత నిలదీశారు.

''కేసీఆర్ గారి ప్రశ్నకు సుత్తి లేకుండా సూటిగా సమాధానం చెప్పండి గౌరవ నిర్మలా సీతారామన్ గారూ.. లాభాల్లో ఉన్న ఎల్ఐసీని ఎందుకు అమ్ముతున్నారు? దేశం కోసమా? దేశం అంటే మట్టి మాత్రమే కాదు. ఎల్ఐసీ అమ్మితే ఉద్యోగాలు, రిజర్వేషన్లు కోల్పోయే బిడ్డల కుటుంబాల పరిస్థితి ఏమిటి?'' అని నిర్మలా సీతారామన్‌ను కవిత ప్రశ్నించారు.

అంత‌క‌ముందు..' కార్మికుల చెమట చుక్కతో దక్షిణ భారతానికి వెలుగులు పంచుతున్న తెలంగాణ మణిమాణిక్యం సింగరేణి సంస్థను నిర్వీర్యం చేసేందుకు కేంద్ర బీజేపీ ప్రభుత్వం కుట్రలు పన్నుతోంది. సింగరేణిలో రాష్ట్రానికి 51%,కేంద్రానికి 49% వాటా ఉన్నప్పటికీ బీజేపీ తన అధికారాలను తప్పుడు రీతిలో ఉపయోగిస్తోంది. సీఎం శ్రీ కేసీఆర్ గారి నాయకత్వంలో సింగరేణి సంస్థ అద్భుతమైన పురోగతితో,దేశంలోని ఇతర సంస్థల కంటే ఎంతో గొప్పగా లాభాలు సాధించింది. లాభాల్లో ఉన్న సింగరేణి సంస్థను నష్టాల్లో ఉన్నట్టుగా చూపిస్తూ,4 బొగ్గు బ్లాకులను కేంద్రం వేలం వేస్తోంది. ఇది సమాఖ్య స్పూర్తికి పూర్తిగా విరుద్దం. సింగరేణి ప్రైవేటీకరణకు వ్యతిరేకిస్తూ సీఎం కేసీఆర్ గారు అనేక సార్లు విజ్ఞప్తి చేసినా కేంద్ర ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తోంది.బొగ్గు గనుల వేలాన్ని నిలిపివేసే వరకూ,కార్మికుల పక్షాన గల్లీ నుండి ఢిల్లీ వరకు అన్ని స్థాయిల్లో టీఆర్ఎస్ పార్టీ కొట్లాడుతుంది 'అంటూ క‌విత వ‌రుస ట్వీట్లు చేశారు.


Next Story