బ్రేకింగ్: ఎమ్మెల్యే రాజాసింగ్‌పై సస్పెన్షన్ రద్దుచేసిన బీజేపీ

గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై ఉన్న సస్పెన్షన్‌ను ఎత్తివేసింది బీజేపీ.

By Srikanth Gundamalla  Published on  22 Oct 2023 6:00 AM GMT
mla rajasingh, revoke suspension, bjp,

బ్రేకింగ్: ఎమ్మెల్యే రాజాసింగ్‌పై సస్పెన్షన్ రద్దుచేసిన బీజేపీ

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల వేళ బీజేపీ అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది. గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై ఇప్పటి వరకు ఉన్న సస్పెన్షన్‌ను ఎత్తివేసింది. ఈ క్రమంలోనే సస్పెన్షన్‌ను రద్దు చేస్తున్నట్లు బీజేపీ డిసిప్లినరీ కమిటీ ప్రకటన జారీ చేసింది.

వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో గతేడాది ఆగస్టు 23న రాజాసింగ్‌ను బీజేపీ సస్పెండ్‌ చేసింది. ఆయన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని ఆ పార్టీ ఆదేశించింది. దీంతో రాజాసింగ్‌ తన వివరణ ఇచ్చారు. వివరణను పరిగణనలోకి తీసుకున్న బీజేపీ.. తాజాగా సస్పెన్షన్‌ను ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు పార్టీ కేంద్ర క్రమశిక్షణ సంఘం సభ్య కార్యదర్శి ఓం పాఠక్‌ ఓ ప్రకటన విడుదల చేశారు.

తొలి జాబితా విడుదల చేసే ముందే రాజాసింగ్‌పై ఉన్న సస్పెన్షన్‌ను బీజేపీ రద్దు చేస్తుందని ప్రచారం జరిగింది. అంతేకాదు.. మొదటి జాబితాలోనే రాజాసింగ్ పేరు కూడా ఉంటుందని తెలుస్తోంది. తెలంగాణలో బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితా ఏ క్షణమైనా విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాగా.. 2018 ఎన్నికల్లో గోషామహల్‌ నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన రాజాసింగ్ విజయం సాధించారు. బీజేపీ నుంచి అసెంబ్లీకి ఎన్నికైన ఏకైక ఎమ్మెల్యేగా రాజాసింగ్ నిలిచారు. సస్పెన్షన్‌ ఉన్న నేపథ్యంలో ఈ సారి బీజేపీ నుంచి పోటీ చేస్తారా లేదా అనే ఉత్కంఠ కొంత మేరకు ఉండింది. రాజాసింగ్ కూడా తాను బీజేపీ నుంచి మాత్రమే పోటీ చేస్తానని.. లేదంటే రాజకీయాలకు దూరంగా ఉంటానని అన్నారు. ఈ నేపథ్యంలో రాజాసింగ్‌పై ఉన్న సస్పెన్షన్ ఎత్తివేతతో ఆయన బీజేపీ తరఫున మరోసారి బరిలోకి దిగునున్నారనే దానిపై క్లారిటీ వచ్చింది.

Next Story