తెలంగాణ పత్రికల్లో కర్ణాటక ప్రభుత్వ ప్రకటనలపై తాత్కాలిక నిషేధం

తెలంగాణ పత్రికల్లో కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వ ప్రకటనలను ఎన్నికల సంఘం (ఈసీ) తాత్కాలికంగా నిలిపివేసింది.

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  28 Nov 2023 7:01 AM GMT
election commission, karnataka govt, ads,  telangana newspapers,

తెలంగాణ పత్రికల్లో కర్ణాటక ప్రభుత్వ ప్రకటనలపై తాత్కాలిక నిషేధం

తెలంగాణ పత్రికల్లో కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వ ప్రకటనలను ఎన్నికల సంఘం (ఈసీ) తాత్కాలికంగా నిలిపివేసింది. తెలంగాణ దినపత్రికల్లో వచ్చిన ప్రకటనలపై వివరణ ఇవ్వాలని కోరుతూ కర్ణాటక ప్రభుత్వానికి ఈసీ సోమవారం నోటీసులు జారీ చేసింది. ఈ ప్రకటనల కోసం కర్ణాటక ప్రభుత్వం ముందస్తు అనుమతి కోరలేదని, తద్వారా ఎన్నికల నిబంధనలను పాటించడం లేదని ఈసీ పేర్కొంది. దాంతో.. నిబంధన ఉల్లంఘనకు సంబంధించి సమాచార పౌరసంబంధాల శాఖ ఇన్‌ఛార్జ్‌ కార్యదర్శిపై క్రమశిక్షణా చర్యలు ఎందుకు తీసుకోకూడదని కూడా ఎన్నికల కమిషన్ ప్రశ్నించింది.

ప్రజాప్రాతినిధ్య చట్టం, ఎంసీసీ ఉల్లంఘనలపై బీజేపీ నేతలు ఫిర్యాదు చేయడంతో యాడ్స్‌పై నిషేధం విధించారు. ఎన్నికలకు ముందు తెలంగాణలోని మీడియాలో వచ్చే ఇలాంటి ప్రకటనలు నవంబర్ 30న జరగనున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేస్తాయని వారు అన్నారు. అయితే.. తాజాగా ఈసీకి ప్రకటనలపై కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్, మాజీ మంత్రి ప్రకాశ్ జవదేకర్, ఇతర పార్టీ నేతలు సుధాన్షు త్రివేది, ఓం పాఠక్ సహా బీజేపీ నేతలు ఫిర్యాదు చేశారు. కర్నాటకలోని కాంగ్రెస్, పొరుగు రాష్ట్రమైన తెలంగాణలో ఎన్నికలను ప్రభావితం చేసేందుకు ప్రజా ధనాన్ని వినియోగిస్తోందని, ప్రకటనల ద్వారా చట్టపరమైన చర్యలకు కూడా బీజేపీ పిలుపునిచ్చింది.

తెలంగాణలో మంగళవారం సాయంత్రం నుండి సైలెంట్ పీరియడ్ ప్రారంభమవుతుంది. EC నిబంధనల ప్రకారం, “ఏ రాజకీయ పార్టీ అయినా.. అభ్యర్థి అయినా.. మరే ఇతర వ్యక్తి కూడా రాజకీయ ప్రకటనలు పోలింగ్ రోజు, పోలింగ్ రోజు ముందు ప్రింట్ మీడియాలో ప్రచురించకూడదు. రాష్ట్ర, జిల్లా స్థాయిలో మీడియా సర్టిఫికేషన్ మానిటరింగ్ కమిటీ (MCMC). దరఖాస్తుదారులు అటువంటి ప్రకటనల ప్రచురణ యొక్క ప్రతిపాదిత తేదీకి రెండు రోజుల ముందు MCMCకి దరఖాస్తు చేసుకోవాలి".

Next Story