రోడ్డు ప్రమాదంలో బీజేపీ నేత దుర్మరణం

కరీంనగర్ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో బీజేపీ నేత మృత్యువాత పడ్డారు.

By Srikanth Gundamalla  Published on  17 Jun 2023 5:06 AM GMT
Karimnagar, Road Accident, BJP Leader Died

రోడ్డు ప్రమాదంలో బీజేపీ నేత దుర్మరణం

కరీంనగర్ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో బీజేపీ నేత మృత్యువాత పడ్డారు.

కరీంనగర్‌ జిల్లా శంకరపట్నం మండలం కొత్తగట్టు దగ్గర శనివారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో హుజూరాబాద్‌ మండలం కునుకులగిద్దె సర్పంచ్‌ గోపు కొమురారెడ్డి మృతిచెందారు. కొమురారెడ్డి నడుపుతున్న కారు అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్టుని ఢీకొట్టినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కరీంనగర్‌ నుంచి హుజూరాబాద్‌ వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. హుజూరాబాద్‌ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ సన్నిహితుడు కొమురారెడ్డి హుజూరాబాద్‌ టీఆర్ఎస్‌ అధ్యక్షుడిగా, ఇతర పదవుల్లో పని చేశారు. ఈటల రాజేందర్‌తో పాటు కలిసి కొమురారెడ్డి బీజేపీలో చేరారు.

Next Story