తెలంగాణలో పలువురు ఐపీఎస్ అధికారులకు పోస్టింగ్స్

తెలంగాణలో పలువురు ఐపీఎస్‌ అధికారులకు పోస్టింగ్‌లు ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

By Srikanth Gundamalla  Published on  20 Oct 2023 11:45 AM GMT
IPS, postings,  telangana,

తెలంగాణలో పలువురు ఐపీఎస్ అధికారులకు పోస్టింగ్స్ 

తెలంగాణలో పలువురు ఐపీఎస్‌ అధికారులకు పోస్టింగ్‌లు ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్నికల ముందు రాజకీయాల్లోనే కాదు.. ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలు కూడా హాట్‌టాపిక్‌గా మారాయి. ఇటీవల రాష్ట్రంలో పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను బదిలీ చేసిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించేందుకే బదిలీలు చేసినట్లు ఎన్నికల సంఘం పేర్కొంది. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్, వరంగల్ సీపీ రంగనాథ్‌లతో పాటు ఖమ్మం, నిజామాబాద్ కమీషనర్లను తెలంగాణ ప్రభుత్వం బదిలీ చేసింది. ఆ తర్వాత ఈసీ సూచనలతోనే ఆయా జోన్లలో నియామకాలు జరిగాయి. హైదరాబాద్ సీపీగా సందీప్ శాండిల్య బాధ్యతలు స్వీకరించారు.

తాజాగా తెలంగాణలో పలువురు ఐపీఎస్‌ అధికారులకు పోస్టింగ్‌లను ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం.

పోస్టింగ్స్ పొందిన అధికారులు :

టీఎస్‌పీఏ జాయింట్ డైరెక్టర్‌గా రంగనాథ్‌

టీఎస్‌పీఏ డిప్యూటీ డైరెక్టర్‌గా రాజేంద్ర ప్రసాద్

సీఐడీ ఎస్పీగా శ్రీనివాస్ రెడ్డి

గ్రే హౌండ్స్ ఎస్పీగా వెంకటేశ్వర్లు

సౌత్ వెస్ట్ జోన్ డీసీపీగా నితికా పంత్

సౌత్ ఈస్ట్ జోన్ డీసీపీగా రోహిత్ రాజ్

ట్రాఫిక్ డీసీపీగా ఆర్‌.వెంకటేశ్వర్లు

పెద్దపల్లి డీసీపీగా సునీతా మోహన్

Next Story