పెరిగిన చలి తీవ్రత.. తెలుగు రాష్ట్రాల్లో మరింత తగ్గనున్న ఉష్ణోగ్రతలు

Increased cold intensity.. Temperatures will drop further in Telugu states. హైదరాబాద్: చలికాలం ప్రారంభం కావడంతో హైదరాబాద్‌తో పాటు తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో రానున్న రోజుల్లో

By అంజి  Published on  28 Nov 2022 9:13 AM GMT
పెరిగిన చలి తీవ్రత.. తెలుగు రాష్ట్రాల్లో మరింత తగ్గనున్న ఉష్ణోగ్రతలు

హైదరాబాద్: చలికాలం ప్రారంభం కావడంతో హైదరాబాద్‌తో పాటు తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో రానున్న రోజుల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశం ఉంది. హైదరాబాద్‌లో ఉష్ణోగ్రత 15 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోవచ్చని తెలంగాణ స్టేట్ ప్లానింగ్ అండ్ డెవలప్‌మెంట్ సొసైటీ (టీఎస్‌డీపీఎస్) అంచనా వేసింది. అటవీ ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రత 2 నుంచి 4 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) పేర్కొంది. ఆసిఫాబాద్‌లో పాదరసం 9.1 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత , హైదరాబాద్‌ నగరంలో అత్యల్పంగా ఆర్‌సి పురంలో 13.8 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది.

ఇదిలా ఉంటే.. ఉపరితల ఆవర్తనం, అల్పపీడనం, తూర్పుగాలుల ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో కొద్దిరోజులుగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిశాయి. ప్రస్తుతం అల్పపీడనం లేకపోవడం, ఉపరితల ఆవర్తనం లేకపోవడం, గాలులు, వర్షాలు తగ్గుముఖం పట్టడంతో మళ్లీ పొడి వాతావరణం నెలకొంది. గుంటూరు, ప్రకాశం, ఎస్‌పిఎస్‌ఆర్‌ నెల్లూరు జిల్లాల్లో సోమవారం ఒకటి, రెండు చోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని, మిగిలిన ప్రాంతాల్లో పొడిగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. మంగళ, బుధ, గురువారాల్లో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో పొడి వాతావరణం కొనసాగుతుందని పేర్కొంది.

మరోవైపు దిగువ ట్రోపోస్పియర్ నుంచి తూర్పు, ఈశాన్య గాలులు రాష్ట్రంలోకి వీస్తున్నాయని, దీని కారణంగా రాష్ట్రంలో కనిష్ట ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గి చలి తీవ్రత పెరుగుతుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇప్పటికే కోస్తాంధ్రలోని కొన్ని ప్రాంతాల్లో ఒకటి, రెండు డిగ్రీల పతనంతో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా, రాయలసీమలో పలుచోట్ల సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయి. కాగా, శనివారం రాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకు రాష్ట్రంలోనే అత్యల్పంగా కళింగపట్నంలో 16.2 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది.

Next Story