డయాలసిస్‌ రోగులకు ఆసరా పింఛన్లు.. పంపిణీ చేసిన మంత్రి హరీష్‌ రావు

Health Minister Harish Rao distributed the support pension to the dialysis patients. తెలంగాణ వైద్యారోగ్య శాఖ మంత్రి టీ హరీశ్ రావు మంగళవారం హైదరాబాద్ నగరంలో డయాలసిస్ రోగులకు

By అంజి  Published on  11 Oct 2022 11:08 AM GMT
డయాలసిస్‌ రోగులకు ఆసరా పింఛన్లు.. పంపిణీ చేసిన మంత్రి హరీష్‌ రావు

తెలంగాణ వైద్యారోగ్య శాఖ మంత్రి టీ హరీశ్ రావు మంగళవారం హైదరాబాద్ నగరంలో డయాలసిస్ రోగులకు ఆసరా పింఛన్లను పంపిణీ చేశారు. ప్రభుత్వం పింఛన్‌ను రోగుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసిందన్నారు. 5 వేల మంది డయాలసిస్‌ రోగులకు ఆసరా పింఛన్లు ఇవ్వాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు నిర్ణయించారని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తెలిపారు. అనంతరం మీడియాతో హరీశ్‌రావు మాట్లాడుతూ.. రాష్ట్రంలోని పలు ప్రభుత్వాసుపత్రుల్లో 12 వేల మంది డయాలసిస్‌ రోగులు ఉన్నారని, వారి డయాలసిస్‌ అవసరాల కోసం ప్రభుత్వం రూ.100 కోట్లు వెచ్చిస్తోందన్నారు.

తెలంగాణ ప్రభుత్వం తొలిసారిగా డయాలసిస్‌ కోసం సింగిల్‌ యూజ్‌ ఫిల్టర్‌ను వినియోగిస్తోందని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వ ప్రజా సంక్షేమ విధానాలను తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ప్రశంసించారని పునరుద్ఘాటించిన మంత్రి, రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసిన 105 డయాలసిస్ కేంద్రాల ద్వారా వేలాది మంది రోగులకు డయాలసిస్ ప్రక్రియలు జరుగుతున్నాయన్నారు. డయాలసిస్‌ రోగికి కిడ్నీ మార్పిడి అవసరమైతే ప్రభుత్వాసుపత్రుల్లో ఉచితంగా చికిత్స అందిస్తున్నామని హరీశ్‌రావు తెలిపారు. ఈ రోగులకు సూచించిన మందులు కూడా ఉచితంగా లభిస్తాయని ఆయన చెప్పారు. కిడ్నీ మార్పిడి చేయించుకోవాల్సిన వారికి రాష్ట్ర ప్రభుత్వం ఒక్కో రోగికి రూ.10 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందజేస్తుందని మంత్రి తెలిపారు.

Next Story