ఇవాళ మరోసారి కాళేశ్వరం కమిషన్‌ను కలవనున్న హరీష్‌రావు

బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావు మరోసారి ఇవాళ కాళేశ్వరం కమిషన్ ముందు హాజరుకానున్నారు.

By Knakam Karthik
Published on : 10 July 2025 8:11 AM IST

Kalehswaram Project, Harish Rao, Kaleswaram Commission, PC Ghosh

ఇవాళ మరోసారి కాళేశ్వరం కమిషన్‌ను కలవనున్న హరీష్‌రావు

బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావు మరోసారి ఇవాళ కాళేశ్వరం కమిషన్ ముందు హాజరుకానున్నారు. ఉదయం 11 గంటలకు పీసీ ఘోష్ కమిషన్‌ను మాజీ మంత్రి హరీశ్‌రావు కలవనున్నారు. ఈ కేసులో జూన్ 9న ఇది వరకే హరీష్ రావు కమిషన్ ముందు హాజరై తన వివరణ ఇచ్చారు. కాగా, మరింత సమాచారం అందించేందుకు ఆయన కొంత గడువు కోరారు. ఈ విజ్ఞప్తి మేరకు నేడు ఉదయం 11 గంటలకు కలవడానికి కమిషన్ సమయం ఇవ్వగా.. హరీష్ రావు కమిషన్ ముందు హాజరయ్యి, మరింత సమాచారం అందించనున్నారు. అయితే ఈ నెల 27 తర్వాత కాళేశ్వరంపై రాష్ట్ర ప్రభుత్వానికి పీసీ ఘోష్ కమిషన్ తుది నివేదికను సమర్పించబోతున్నట్లు తెలుస్తోంది

Next Story