గవర్నర్ తమిళిసై ఇంట విషాదం

Governor Tamilisai Mother Krishna kumari passed away.తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్ ఇంట విషాదం

By తోట‌ వంశీ కుమార్‌  Published on  18 Aug 2021 2:48 AM GMT
గవర్నర్ తమిళిసై ఇంట విషాదం

తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్ ఇంట విషాదం నెల‌కొంది. తమిళిసై తల్లి కృష్ణకుమారి క‌న్నుమూశారు. ఆమె వ‌య‌స్సు 80 సంవ‌త్స‌రాలు. ఇటీవ‌ల కృష్ణ‌కుమారి తీవ్ర అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యారు. దీంతో హైద‌రాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్నారు. ఆమె ప‌రిస్థితి విష‌మించ‌డంతో బుధ‌వారం ఉద‌యం తుదిశ్వాస విడిచారు.దీంతో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కుటుంబ సభ్యులు తీవ్ర శోకసంద్రంలో మునిగిపోయారు. ఈ రోజు మధ్యాహ్నం వరకు పార్థివశరీరాన్ని రాజ్‌భవన్‌లో ఉంచనున్నారు. అనంతరం ఆమె భౌతికకాయాన్ని చెన్నైకి తరలించనున్నారు. కృష్ణకుమారి మాజీ ఎంపీ కుమారినందన్‌ భార్య. తెలంగాణ గవర్నర్‌ తమిళిసై ఆమె పెద్ద కూతురు. కాగా.. గవర్నర్‌ తమిళిసై మాతృమూర్తి మృతిపట్ల పలువురు ప్రముఖులు సంతాపం తెలియజేశారు.

గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ మాతృమూర్తి కృష్ణ కుమారి మరణం పట్ల స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధిస్తూ.. గవర్నర్ కుటుంబసభ్యులకు స్పీకర్ ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Next Story