తెలంగాణ ప్రజాప్రతినిధుల పట్ల టీటీడీ వివక్ష.. శ్రీనివాస్‌గౌడ్‌ సంచలన వ్యాఖ్యలు

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)లో తెలంగాణ ప్రజాప్రతినిధులపై వివక్ష చూపుతున్నారని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆందోళన వ్యక్తం చేశారు.

By అంజి
Published on : 19 Dec 2024 12:05 PM IST

Former minister Srinivas Goud, TTD, discrimination, Telangana public representatives

తెలంగాణ ప్రజాప్రతినిధుల పట్ల టీటీడీ వివక్ష.. శ్రీనివాస్‌గౌడ్‌ సంచలన వ్యాఖ్యలు

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)లో తెలంగాణ ప్రజాప్రతినిధులపై వివక్ష చూపుతున్నారని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆందోళన వ్యక్తం చేశారు. టీటీడీ తెలుగు ప్రజలను ఆంధ్రా, తెలంగాణగా విభజిస్తోందని వ్యాఖ్యానించారు. తిరుమల ఆలయాన్ని సందర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడిన శ్రీనివాస్‌ గౌడ్.. దేవుడి ముందు అందరూ సమానమేనని, వివక్ష ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని ఉద్ఘాటించారు. తెలంగాణ ప్రజాప్రతినిధులకు గతంలో కల్పించిన సదుపాయాలను సమైక్య ప్రభుత్వం కొనసాగించాలని శ్రీనివాస్‌ గౌడ్ కోరారు.

టీటీడీ చైర్మన్‌కు పూర్తి స్వేచ్ఛ ఇస్తే తెలంగాణ ప్రజలకు న్యాయం జరుగుతుందని అన్నారు. తెలంగాణ ఏర్పాటైన 10 ఏళ్లలో ముఖ్యంగా వ్యాపార, అధికార పదవుల్లో ఆంధ్రా ప్రజలు అత్యధికంగా లబ్ధి పొందారని గౌడ్‌ అన్నారు. తెలంగాణలో ఎక్కడా ఆంధ్రా తెలంగాణ ప్రజల మధ్య విబేధాలు లేవన్నారు. తెలంగాణపై వివక్ష ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో ఆంధ్రా ప్రజలు తెలంగాణలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఆయన చేసిన వ్యాఖ్యలు పెద్ద ఎత్తున చర్చకు దారితీశాయి.

Next Story