Telangana: 16 వేల మంది ఉద్యోగుల పదవీకాలం పొడిగింపు

వైద్య ఆరోగ్య శాఖలో డీఎంఈ విభాగంలోని కాంట్రాక్ట్‌, ఔట్‌ సోర్సింగ్‌, హానరోరియం, మల్టీ టాస్కింగ్‌ విధానంలో పని చేస్తున్న 16 వేల మంది ఉద్యోగుల పదవీ కాలన్ని రాష్ట్ర ప్రభుత్వం పొడిగించింది.

By అంజి
Published on : 30 Jun 2025 7:41 AM IST

Extension of tenure, contract, outsourcing employees, medical and health department

Telangana: 16 వేల మంది ఉద్యోగుల పదవీకాలం పొడిగింపు

హైదరాబాద్‌: వైద్య ఆరోగ్య శాఖలో డీఎంఈ విభాగంలోని కాంట్రాక్ట్‌, ఔట్‌ సోర్సింగ్‌, హానరోరియం, మల్టీ టాస్కింగ్‌ విధానంలో పని చేస్తున్న 16 వేల మంది ఉద్యోగుల పదవీ కాలన్ని రాష్ట్ర ప్రభుత్వం పొడిగించింది. 2026 మార్చి 31 వరకు వీరు విధుల్లో కొనసాగనున్నారు. వీరంతా ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలు, టీచింగ్‌ ఆస్పత్రులు, నర్సింగ్‌, డెంటల్‌ కాలేజీల్లో పని చేస్తున్నారు. సిబ్బంది కొరత కారణంగానే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.

అటు వైద్య విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వారికి శాతం స్టైఫండ్‌ పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మెడికల్‌, డెంటల్‌ స్టూడెంట్స్‌తో పాటు, సీనియర్‌ రెసిడెంట్ల గౌరవ వేతనం పెంచింది. ఈ మేరకు వైద్యారోగ్య శాఖ సెక్రటరీ క్రిస్టినా జెడ్ చొంగ్తూ ఆదివారం ఉత్తర్వులు ఇచ్చారు. అలాగే గత మూడు నెలల స్టైపెండ్‌‌ బకాయిలు రూ.135 కోట్లు కూడా ప్రభుత్వం విడుదల చేసింది.

పెంచిన స్టైఫండ్‌ ప్రకారం.. ఇంటర్న్‌లకు నెలకు రూ.29,792, పీజీ డాక్టర్లకు ఫస్ట్‌ ఇయర్‌ రూ.67,032, సెకండ్‌ ఇయర్‌లో రూ.70,757, ఫైనల్‌ ఇయర్‌లో రూ.74,782 చొప్పున స్టైఫండ్‌ అందనుంది.

సూపర్ స్పెషాలిటీ డాక్టర్లు ఫస్ట్ ఇయర్ లో రూ.92,575 నుంచి రూ.1,06,461, సెకండ్ ఇయర్ లో రూ.97,204 నుంచి రూ.1,11,785, థర్డ్ ఇయర్ లో రూ.1,01,829 నుంచి రూ.1,17,103 వరకు స్టైఫండ్‌ అందుకుంటారు. ఎండీఎస్: ఫస్ట్ ఇయర్ రూ.58,289 నుంచి రూ.67,032, సెకండ్ ఇయర్ రూ.61,528 నుంచి రూ.70,757, థర్డ్ ఇయర్ రూ.64,767 నుంచి రూ.74,482. సీనియర్ రెసిడెంట్స్: రూ.92,575 నుంచి రూ.1,06,461కు పెంపు జరిగింది.

Next Story