సికింద్రాబాద్లోని పరేడ్ గ్రౌండ్స్లో జరుగుతున్న తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ కార్యక్రమానికి జపాన్ ప్రతినిధుల బృందం హాజరైంది. ఈ సందర్భంగా పోలీసులకు ఉత్తమ సేవా పతకాలను సీఎం ప్రదానం చేయనున్నారు.
అంతకుముందు తెలంగాణన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గన్పార్క్ వద్ద అమరవీరుల స్తూపానికి సీఎం రేవంత్ రెడ్డి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, ఎంపీలు, ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా సీఎం రేవంత్ ట్వీట్ చేశారు. 'ఆహార్యంలో ఆత్మగౌరవం.. ఆ రూపంలో నిండుదనం.. తెలంగాణ తల్లికి.. సదా సర్వదా నీరాజనం' అని పేర్కొన్నారు. తెలంగాణ తల్లి గీతాన్ని ఆయన పంచుకున్నారు.